Apply Now: 'పది' అర్హతతో 30 వేలకు పైగా పోస్టులు.. త్వరగా అప్లై చేసుకోండి...
తపాలా శాఖ(Indian Post)లో 30వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు సమీపిస్తోంది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో మొత్తం 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) పోస్టుల భర్తీకి ఆగస్టు 3న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ బుధవారం (ఆగస్టు 23)తో ముగియనుంది.
ఈ ఉద్యోగంపై ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు త్వరగా ఆన్లైన్లో https://indiapostgdsonline.gov.in/ దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తుల్లో సవరణలకు ఆగస్టు 24 నుంచి 26వరకు ఛాన్స్ ఉంది.
పరీక్ష లేదు.. వేతనం ఎంతంటే?
బ్రాంచ్ పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM)/ డాక్సేవక్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్టు అధికారులు నోటిఫికేషన్లో తెలిపారు. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అలాగే, అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం రావాలి. ఆ ఉద్యోగాలను బట్టి బీపీఎంకు వేతన శ్రేణి రూ.12 వేలు -రూ.29,380; ఏబీపీఎం/డాక్ సేవక్కు రూ.10వేలు -24,470గా నిర్ణయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున గరిష్ఠ వయసులో సడలింపు ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో భర్తీచేసే ఉద్యోగాలెన్ని?
మొత్తం 30,041 పోస్టులకు గాను ఏపీలో 1058, తెలంగాణలో 961 చొప్పున భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు నాలుగు గంటల పాటు పనిచేస్తే సరిపోతుంది. అలాగే, వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్లకు ప్రోత్సాహకాలు ఇస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి.
0 Comments:
Post a Comment