బిల్వపత్రం లేదా ఆ చెట్టు ఆకులను పూజించడం యొక్క ప్రాముఖ్యతను శివపురాణం వివరిస్తుంది
దీన్ని మానవులే కాదు దేవతలు సైతం పూజిస్తారు. ముఖ్యంగా 3 బిల్వ చెట్టు పేడులను శివునికి సమర్పిస్తే మహాశివుని అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు.
ఈ చెట్టు యొక్క కొమ్మల కింద స్నానం చేస్తే విశ్వంలోని అన్ని పవిత్ర జలాలు, పుణ్యనదుల్లో స్నానం చేసిన దానితో సమానమని చెబుతారు.అంతే కాదు బిల్వపత్రం మనిషి జీవితంలోని కీడును, దోషాలను తొలగించడానికి సహాయపడుతుంది.
మన ఇంటి ఆవరణలో బిల్వవృక్షం, లేదా మొక్క ఉంటే ఎంత మేలు చేస్తుందో చాలా మందికి తెలియదు. ఈ బిల్వపత్రమే కాదు పండు కూడా చాలా మేలు చేస్తుంది. ఆరోగ్య పరంగా బిల్వపత్రం వల్ల కలిగే లాభాలు అందరికీ తెలుసు. కాన జ్యోతిష్యం ప్రకారం ఏం ఫలితం వస్తుందో చూద్దాం.
హిందువుల విశ్వాసం ప్రకారం బిల్వపత్ర చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ఈ చెట్టును పూజించడం వల్ల డబ్బు, ఆర్ధిక పరమైన చికాకులు దరి చేరవని చెబుతుంటారు. ముఖ్యంగా ఎక్కువగా బిల్వపత్రాలను కలిపి ఇంటి దగ్గర నాటితే ఐశ్వర్యం పెరుగుతుంది.
ఈ బిల్వపత్రాన్ని శివుడికి నైవేద్యంగా పెడితే పాపాలు నశిస్తాయి. అలాగే ఈ చెట్టును పూజిస్తే లేదా ఇంటి దగ్గర పెట్టుకుంటే మన పాపాలు తగ్గుతాయి. అలాగే దీన్ని రోజూ పూజిస్తే చాలా మంచిది.
ఈ బిల్వపత్రం వృక్షానికి నెయ్యి, ఆహారం, పాయసం లేదా స్వీట్లను సమర్పించడం ద్వారా పేదరికం తొలగిపోతుందని మరియు ఆర్థిక సమస్యలు ఎప్పటికీ తలెత్తవని నమ్ముతారు. అలాగే సంపద కూడా పెరుగుతుంది.
బిల్వపత్ర జలాన్ని నుదుటిపై పూసుకుంటే సకల తీర్థయాత్రల పుణ్యం లభిస్తుంది. అలాగే సోమవారం బిల్వపత్రం ఆకులను తీయకూడదని చెబుతారు. ఇలా చేస్తే జీవితంలో చాలా సమస్యలు వస్తాయి.
బిల్వపత్రంలో శివుడు మరియు పార్వతి నివసిస్తారని నమ్ముతారు. కాబట్టి బిల్వ నైవేద్యాన్ని సమర్పించి, శివ-పార్వతిని పూజించిన వారికి మహాదేవుడు మరియు పార్వతి అనుగ్రహం లభిస్తుంది.
0 Comments:
Post a Comment