అమ్మాయిలతో నగ్నంగా క్షుద్రపూజలు... గుంటూరులో తాంత్రికుడి చేష్టలు వెలుగులోకి...
ఏపీ లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో దారుణం జరిగింది. నగ్నంగా పూజలు చేస్తే డబ్బు వస్తుందన్న ఓ కేడీ లేడీ మాయమాటలు నమ్మిన ముగ్గురు యువతులు.
నకిలీ పూజారి చేతిలో మోసపోయారు. నగ్న పూజలతో పాటు ఆ ముగ్గురు అమ్మాయిలపై సదరు దొంగ బాబా రోజుల తరబడి అత్యాచారం చేసినట్లు సమాచారం. లాడ్జిల్లో, రహస్య ప్రదేశాల్లో అమ్మాయిలను నగ్నంగా కూర్చోబెట్టి ఈ 'పూజలు' చేసినట్లు తెలిసింది. పూజ మధ్యలో లేస్తే వచ్చే లక్షల రూపాయలు రాకుండా పోతాయని చెప్పి.. నకిలీ పూజారితో పాటు ఆ కేడీ లేడీ నిలువునా మోసం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. చిలకలూరిపేటకు చెందిన మహిళకు సోషల్ మీడియాలో.. తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన నకిలీ పూజారి పరిచయమయ్యాడు. తరువాత కర్నూలు జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు.. అనతి కాలంలోనే అధికంగా డబ్బును సంపాదించాలనే ఆశతో అదే మహిళను సంప్రదించారు. దీంతో ఆ మహిళ.. నకిలీ పూజారిని రంగంలోని దించింది. ఇద్దరు కలిసి.. లాడ్జిల్లో అమ్మాయిలను నగ్నంగా కూర్చోపెట్టి.. పూజలు చేశారు. అదే విధంగా పొన్నేకల్లులోని కొన్ని రహస్య ప్రదేశాలలో పూజలు చేశారు. పూజల పేరుతో అత్యాచారం ? జరిపి.. మధ్యలో ఆపితే వచ్చే డబ్బులు కూడా రావని చెప్పి దారుణానికి తెగబడినట్లు తెలిసింది. నకిలీ పూజారి, సదరు మహిళ తీరుపై అనుమానం వచ్చి.. తాము మోసపోయామని గ్రహించిన ఆ యువతులు.. దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వ్యవహరం బెడిసి కొట్టడంతో.. ఆ ముగ్గురు అమ్మాయిలను ఓ ప్రదేశంలో విడిచిపెట్టి.. నకిలీ పూజారి పరారయ్యాడు. పూజలు చేసిన అనంతరం అమ్మాయిలను.. నకిలీ పూజారి శారీరకంగా అనుభవించాడని యువతులు పోలీసులకు తెలిపారు.
చిలకలూరిపేటకు చెందిన ఆ మహిళ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ పూజారితో విజయవాడ, గుంటూరు, పొన్నెకల్లు, ఒంగోలులోని లాడ్జిల్లో ఈ యువతులు పూజలు చేసినట్లు సమాచారం. ఇలా గతకొన్ని రోజులుగా పూజల పేరుతో ఈ అమ్మాయిలపై అత్యాచారం చేశారని.. పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు.. ఇంతకు ముందు ఇలాంటివి ఏమైనా చేశారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. బాధిత అమ్మాయిలను పోలీసు స్టేషన్కు తరలించి.. పోలీసులు రక్షణ కల్పించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
////////////////
అమరావతి : అమ్మాయిలతో నగ్నంగా క్షుద్రపూజలు చేయిస్తున్న ఓ తాంత్రికుడి ఉదంతం గుంటూరులో బయటపడింది.ఓ మహిళ సహకారంతో అమ్మాయిలకు డబ్బుల ఆశచూపి పూజలు చేస్తున్నాడు ఈ కేటుగాడు.
అతడి చేతిలో మోసపోయిన యువతులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ క్షుద్రపూజల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంత్రతంత్రాలతో డబ్బులు సంపాదించవచ్చని అమాయకులను నమ్మించేవాడు. ఈ మాయమాటలు నమ్మినవారితో క్షుద్రపూజలు చేయించేవాడు. ఇలా చిలకలూరిపేటకు చెందిన ఓ మహిళ కూడా ఈజీగా డబ్బులు సంపాదించాలని భావించి సదరు తాంత్రికుడిని ఆశ్రయించింది. సామాజిక మాధ్యమాల ద్వారా తాంత్రికుడితో పరిచయం పెంచుకున్న మహిళ పూర్తిగా అతడి మాయలో పడిపోయింది.
చిలకలూరిపేట మహిళ సాయంతో అమ్మాయిలకు వలవేసి క్షుద్రపూజలు చేయసాగాడు తాంత్రికుడు.ఇలా కర్నూల్ జిల్లాకు చెందిన కొందరు అమాయక అమ్మాయిలకు డబ్బులు ఆశచూపి క్షుద్రపూజలు కోసం తీసుకువచ్చారు. వారితో పదిరోజుల పాటు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో క్షుద్రపూజలు నిర్వహించారు. అమ్మాయిల ఒంటిపై నూలుపోగు లేకుంగా పూర్తి నగ్నంగా పూజలో కూర్చోబెట్టేవారు. ఇలా పదిరోజుల పాటు పూజలు నిర్వహించి ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండానే తిరిగి కర్నూల్ కు పంపించారు.
అయితే క్షుద్రపూజలో పాల్గొంటే ఇస్తామన్న డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరు యువతులు పొన్నెకల్లుకు వెళ్లి తాంత్రికున్ని నిలదీసారు. దీంతో మహిళ, తాంత్రికుడు ఇద్దరు ఆ అమ్మాయిలను బలవంతంగా ఓ వాహనంలో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ గోరంట్ల సమీపంలో వాహనం ఆగిన సమయంలో తప్పించుకున్న అమ్మాయిలు పోలీసులకు ఫోన్ చేసారు. దీంతో పోలీసులు ఇద్దరు అమ్మాయిలను తాంత్రికుడి బారినుండి కాపాడారు.
బాధిత యువతుల నుండి వివరాలు సేకరించిన పోలీసులు మహిళను అరెస్ట్ చేసారు. తాంత్రికుడు మాత్రం తప్పించుకున్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి దొంగబాబాలు,తాంత్రికుల మాయమాటలు అమ్మాయిలు నమ్మవద్దని పోలీసులు సూచించారు.
0 Comments:
Post a Comment