వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన భారత్.. 100 కిలోమీటర్ల రహదారిని కేవలం 100 గంటల్లోనే నిర్మించేశారు
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్-అలీగఢ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం సరికొత్త రికార్డు సృష్టించింది. దాదాపు 100 కిలోమీటర్ల పొడవైన రహదారిని కేవలం 100 గంటల్లోనే నిర్మించేశారు.
ఈ విషయాన్ని జాతీయ రహదారులు, రోడ్డు రవాణాశాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే రహదారి నిర్మాణంలో భాగస్వాములైన వారిని అభినందించేందుకు ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్గా పాల్గొన్నారు. ఎన్హెచ్-34లో ఘజియాబాద్-అలీగఢ్ మధ్య 118 కిలోమీటర్ల పొడవైన మార్గం ఎంతో కీలకమని.. జనసాంద్రత ఎక్కవగా ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
అలాగే ఉత్తర్ప్రదేశ్లోని దాద్రి, కుర్జా, సికందర్బాద్, , గౌతమ్ బుద్ధ్ నగర్ తదితర పట్టణాలను కలుపేలా ఈ రహదారి వెళ్తుండటం అందరికీ కలిసొచ్చే అంశమని గడ్కరీ అన్నారు. వర్తక నిర్వహణకు ఈ రహదారి కీలకంగా పని చేస్తుందని.. వ్యవసాయ, పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ.. ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ రహదారి నిర్మాణంలో వినూత్నంగా గ్రీన్ టెక్నాలజీని కూడా వినియోగించినట్లు తెలిపారు. దాదాపు 90 శాతం మిల్లింగ్ మెటీరియల్ను ఉపయోగించడం వల్ల రహదారి నిర్మాణ సమయంలో పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలను చాలా వరకు తగ్గించినట్లు తెలిపారు.
0 Comments:
Post a Comment