Health Tips: ప్రతి నలుగురిలో ఒకరికి ఈ రెండు జబ్బులు.. చాపకింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధులు!
ప్రస్తుతం అనారోగ్య సమస్యలున్నవారి సంఖ్య పెరిగిపోతోంది.
ప్రతి నిత్యం ఉద్యోగంలో ఒత్తిడి, ఇతర మానసిక టెన్షన్స్, ఆర్థికపరమైన ఇబ్బందులు తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యం బారిన పడుతున్నాడు. అయితే ప్రస్తుత కాలంలో జీవన విధానంలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే జీవితం హాయిగా సాగిపోతుంటుంది. ముఖ్యంగా ఆహార నియమాలలో మార్పులు జరిగితే వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ముఖ్యంగా బీపీ, షుగర్లు బారిన పడేవారు చాలా మందే ఉన్నారు. ఇంతకముందు పట్టణాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ జబ్బులు ఇప్పుడు పల్లెల్లోనూ వ్యాపిస్తున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉందంటే గతంలో నిపుణులు హెచ్చరించారు. కానీ రోజులు పెరుగుతున్న కొద్ది ఈ సమస్యలు మరింతగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ రెండు ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేక వివిధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి.
ఒత్తిడి కారణంగా ఈ అనారోగ్య సమస్యలు దరి చేరుతున్నాయి. వ్యాయామం లేదు, సరైన ఆహారమూ తీసుకోవడం లేదు. పిల్లలు ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావానికి లోనవుతున్నారు. దీని నుంచి బయటపడాలంటే వారిని క్రీడల వైపు మళ్లించాలి. పెద్దవాళ్లు యోగా చేయాలి.
శారీరక వ్యాయామం లేకుంటే చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పండ్లను ఎక్కువగా తీసుకోవడం మంచిది.
ప్రతి రోజు వాకింగ్ అలవాటు చేసుకోవడం ఎంతో మంచిదంటున్నారు. మన జీవన శైలిలో మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచుకోవచ్చని, ఆస్పత్రుల చుట్టు తిరగాల్సిన అవసరం ఉండదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
0 Comments:
Post a Comment