స్థితప్రజ్ఞుడు
డాక్టర్ ఏపూరి హర్షవర్ధన్, ఖమ్మం వాసి ... వృత్తి రీత్యా ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో జనరల్ మెడిసిన్ లో వైద్య సేవలు ఇస్తున్నాడు ... పెళ్లి సమయం వచ్చింది ...
వైరా దగ్గరలోని మేనత్త ఊరిలో సింధు అనే అమ్మాయితో వియ్యంనకు పరిచయం ... ఇద్దరూ పరస్పరం వీడియోలో చూసుకున్నారు ... ఇష్టపడ్డారు ... కరోనా కాలం మొదలవుతుంది ... ముందుగా నిర్ణయించిన సమయానికి అనగా ఫిబ్రవరి 12, 2020 నాడు హర్ష సింధుల వివాహం అత్యంత ఘనంగా ఖమ్మంలో జరిగింది ... వారం రోజులపాటు తిరుపతి గుళ్ళు గోపురాలు అత్యంత ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరిగారు.
డాక్టర్ హర్ష ఫిబ్రవరి 29 అనగా లీఫ్ సంవత్సరం నాడు ఆస్ట్రేలియా వెళ్ళాడు. సింధు ఏప్రిల్ మొదటి వారంలో ఆస్ట్రేలియా వెళ్లడానికి ప్లాన్ చేసుకుంది. కానీ, ఆ అమ్మాయి అదృష్టమో దురదృష్టమో కానీ 23, 2020 నుండి కరోనా డేంజర్ బెల్స్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది.
సింధు మాత్రం ఆస్ట్రేలియా వెళ్లలేకపోయింది.
స్వతహాగా డాక్టర్ అయినా హర్షకి పరిశుభ్రత అంటే ప్రాణం ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. స్వయంగా వంట చేసుకునేవాడు. జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ పిజ్జా, బర్గర్ వంటి వాటిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. డాక్టర్ హర్ష కి బాడీ ఫిట్ నెస్ అంటే ఇష్టం. దానికొరకు ప్రతిరోజు జిమ్ చేసేవాడు.
అక్టోబర్ 2020లో జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తుంటే ఆయాసం, కొంచెం, దగ్గు రావడం మొదలైంది. వెంటనే డాక్టర్ హర్ష పరీక్ష చేయించుకోగా ఉప్పెన లాంటి వార్త " లంగ్ క్యాన్సర్ " గా నిర్ధారణ జరిగింది. కుటుంబ సభ్యులందరూ కనీసం 3 నెలల పాటు షాక్ లో ఉన్నారు
లాక్ డౌన్ కారణంగా తల్లిదండ్రులు కూడా ఆస్ట్రేలియా వెళ్లలేని పరిస్థితి. హర్ష ఇండియా రాలేని పరిస్థితి. విమానాలు కూడా నడవటం లేదు.
" క్యాన్సర్ సోకింది అన్న భయంకరమైన నిజాన్ని నేను భరించక తప్పదు " అని భావించిన హర్ష తన తల్లిదండ్రుల్ని, బంధువుల్ని తను ఇష్టపడే వాళ్ళందరికీ " నాకు ఏమి కాదు తగ్గిపోతుందిలే " అని మోటివేట్ చేశాడు. మరోప్రక్క చికిత్స కూడా తీసుకుంటున్నాడు.
మరి అమాయకురాలైన సింధు భవిష్యత్తు ⁉️
డాక్టర్ హర్ష ముందు తనకొచ్చిన క్యాన్సర్ వ్యాధి కంటే పెద్ద సమస్యగా సింధు భవిష్యత్తు మారింది. సింధు విషయం ఏమి చేయాలని తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టాడు.
ఇంకో ప్రక్క అసలే సింధు వాళ్ళ నాన్న ఆక్సిడెంట్ కు గురై 8 సంవత్సరాల నుండి శరీరం చచ్చుబడి బెడ్ మీదనే ఉంటున్న అతనిని అత్యంత ఓపికస్తురాలైన సింధు తల్లి అన్నీ తానై చూసుకుంటుంది.
సింధు గురించి మెరుగ్గా ఆలోచించి చివరకు విడాకులు కోరాడు. కానీ, సింధు ఒప్పుకోలేదు. లాక్ డౌన్ ఎత్తి వేయగానే నేను ఆస్ట్రేలియా వచ్చి నీకు తోడుగా ఉంటాను అంది. కానీ, ఏ ముచ్చట తీరకుండానే విధవరాలు కావడం హర్షకు ఇష్టం లేదు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి విడాకులు తీసుకున్నాడు. విడాకుల సమయంలో ఆ అమ్మాయికి అన్నీ అదనంగానే ఇచ్చాడు. ఇప్పటికీ ఒక స్నేహితురాలిగా ఇస్తూనే ఉన్నాడు. సింధు ఎమ్మెస్ చదవడానికి అమెరికా వెళ్ళింది. సింధుకి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా నచ్చలేదు అంటుంది.
డాక్టర్ తీసుకుంటున్న చికిత్స ఫలితంగా తగ్గిపోయింది అనుకున్న మహమ్మారి ఈసారి మరింత ఉధృతంగా దాడి చేసింది. డాక్టర్ హర్షకి ఈ విషయం పూర్తిగా అర్థం అయ్యింది. ఈ భూమిపై తను ఉండేది ఇక కొన్ని రోజులేనని. తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వస్తా అన్నా కూడా వద్దు అన్నాడు. ఎందుకంటే " ఆ వ్యాధి వల్ల తను పడే బాధలు వాళ్ళు దగ్గర నుండి చూడకూడదు " అని బలంగా అనుకున్నాడు.
వ్యాధి తీవ్రత తెలిసిన దగ్గర నుండి చికిత్స తీసుకుంటూనే ; ప్రతి క్షణం తన తల్లిదండ్రులను అత్యంత సున్నితంగా, మానసికంగా తనకు ఏది జరిగినా భరించడానికి సిద్ధం చేస్తున్నాడు !
2020 ఫిబ్రవరిలో వెళ్లిన డాక్టర్ హర్ష రెండున్నర సంవత్సరాల తర్వాత 2022 అక్టోబర్లో చిట్ట చివరిసారిగా తన తల్లిదండ్రులను చూడడానికి ఇండియా ఖమ్మం వచ్చాడు ... 15 రోజులు ఉన్నాడు.
ఒకేరోజు తన తల్లిదండ్రులను అమెరికాలోని తన తమ్ముడి దగ్గరకు పంపి ... తనకు ఆస్ట్రేలియాలోనే మెరుగైన వైద్యం లభిస్తుంది అని చెప్పి తను ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.
డాక్టర్ హర్ష ఆస్ట్రేలియాలో 100 మందికి పైగా అనాధలు ఉన్న ఆశ్రమంలో వారికి అత్యంత ఓపికగా ప్రేమగా కావాల్సిన వైద్యం అందిస్తూ ఉంటాడు. కానీ డాక్టర్ హర్షా కి తెలుసు తన అనుకున్న వాళ్ళందరినీ ఈ భూమి మీద నుండి వెళ్లిపోవడానికి తనకి చికిత్స చేస్తున్న వైద్యులు మూడు ముందస్తు డెత్ తేదీలు ఇచ్చారని !
ఈ సమయంలోనే అత్యంత " స్థితప్రజ్ఞత " ప్రదర్శిస్తూ తన తల్లిదండ్రులను అందరూ ఆశ్చర్యపోయే విధంగా ... మానసికంగా సిద్ధం చేసిన విధానం వల్ల హర్ష అంటే అందరికీ మరింత గౌరవం ఏర్పడింది !
చక్కటి మనస్తత్వం కలిగి సహాయం చేసే సుగుణ వంతుడైన డాక్టర్ హర్షకు స్నేహితులు ఇండియాలో ఆస్ట్రేలియాలో అనేకమంది ఉన్నారు. అవసరం ఉండి స్నేహితుల మెసేజ్ పెడితే ఎంత పనిలో ఉన్నా ఖచ్చితంగా సాధ్యమైనంత త్వరగా స్పందించేవాడు. " ఫోన్ లో నేను ఒక గంట (లేదా) రెండు గంటల్లో స్పందించలేదు అంటే ఇక హర్ష లేడు అనుకోమని " స్నేహితులతో ముందుగానే చెప్పాడు.
అనుకోని ఆ సమయం రానే వచ్చింది ... డాక్టర్లు ముందుగా ఇచ్చిన ఒక డెత్ డేట్ మార్చి 27, 2023.
దీనికి ముందుగానే తను చనిపోయినప్పుడు ఎవ్వరికీ బరువు భారం కాకుండా లాయర్ తో మాట్లాడి ఆథరైజేషన్ పత్రాన్ని అక్కడి తన స్నేహితులకు ఇచ్చాడు. అలాగే, శవపేటికను స్వయంగా తానే ఆర్డర్ చేసుకున్నాడు. తన కారు కూడా అమ్మేశాడు. నిర్జీవమైన స్థితిలో తన తల్లిదండ్రుల వద్దకు రావడానికి కనీసం సింగిల్ డాలర్ కూడా ఖర్చు పెట్టుకోవడానికి తన స్నేహితులకు అవకాశం ఇవ్వకుండా ప్రతిదీ తనే ప్లాన్ చేసుకున్నాడు.
సిడ్నీలో ఉండే సైంటిస్ట్ అయినా తన బంధువుని మార్చ్ 24 వ తారీకు రమ్మన్నాడు. మార్చి 23 తను రెగ్యులర్ గా వైద్య సేవలు అందించే ఆశ్రమానికి వెళ్ళాడు. నేను ఇండియాకు వెళ్తున్నాను అని బాయ్ బాయ్ చెప్పి వారి దగ్గర నుండి వీడ్కోలు తీసుకున్నాడు.
24 మార్చి ఉదయం బ్రౌన్ కలర్ జాకెట్ వేసుకొని తెల్లటి పాయింట్ తెల్లటి షూ ధరించి చక్కగా ఉన్నాడు. తన స్నేహితులతో కలిసి చాలాసేపు, తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడాడు. అనంతరం అందరూ కలిసి టిఫిన్ చేసి వచ్చారు. ఒక గంట తర్వాత మళ్లీ ఫోన్ చేస్తా అని తల్లికి చెప్పాడు.
" నాకు మళ్ళీ కాఫీ తాగాలనిపిస్తుంది వెళ్లొద్దాం పద " అని స్నేహితులతో అంటే ... " ఎందుకురా ఇప్పుడే కదా తాగాము " అని స్నేహితులు అంటే ; సరే అంటూ తను ఒక్కడే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి కాఫీ తాగి వచ్చాడు.
అనంతరం మూత్ర విసర్జనకు వాష్ రూమ్ కి వెళ్ళగా మూత్రం బదులు రక్తం రావడం గమనించాడు. తన స్నేహితులకు చెప్పాడు " నేను మరొక గంట కంటే ఎక్కువ సమయం మీ ముందు ఉండకపోవచ్చు " అనీ ...
" నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా " అని పడుకున్నాడు ... అంతే రెండు నిమిషాల తర్వాత 32 సంవత్సరాల హర్ష వర్ధన్ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు !
ఇలాంటి పరిస్థితుల్లో కూడా " అంతిమ దశలో తన తల్లిదండ్రుల వద్దకు శవంగా వెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు తనే స్వయంగా చేసుకొని ఇలా కూడా చేయొచ్చా ? అని చూపి అందరికీ ఆదర్శవంతుడు అయ్యాడు !
నిజంగా ఎంతటి " స్థితప్రజ్ఞుడు " డాక్టర్ హర్షవర్దన్ ‼️
😭🙏😭
చావు ప్రతీ మనిషి జీవితంలోని చివరి మజిలీ. మనం ఎంత గొప్ప వాళ్లము అయినా.. ఎన్ని గొప్ప గొప్ప విజయాలను సాధించినా.. మంచి, చెడులతో ఎలాంటి సంబంధం లేకుండా అందరికీ చివరికి మిగిలేది ఆరు అడుగుల నేలే.
మనం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతామని తెలుసు.. కానీ, సరిగ్గా ఎప్పుడు చనిపోతామో తెలీదు. ఒక వేళ మన చావు గురించి మనకు ముందుగానే తెలిస్తే.. దానంత నరకం ఇంకోటి ఉండదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ముందుగానే చనిపోతామని తెలిసిన రోగులు, ఉరి శిక్ష పడ్డ ఖైదీలు తీవ్రమైన మానసిక సంఘర్షణనకు గురవుతూ ఉంటారు. చావు దగ్గర పడే కొద్ది వారిలో ఒకలాంటి బాధ, భయం కలుగుతూ ఉంటాయి.
కొంతమంది ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ, అతికొద్ది మంది మాత్రమే చావును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. బతికే కొన్ని రోజులు ఎవ్వరినీ ఇబ్బందిపెట్టకుండా.. చావు తర్వాత కూడా నా అనుకునే వాళ్లకు మంచి జరగాలని కోరుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో డాక్టర్ హర్షవర్థన్ ప్రవర్తించిన తీరు సినిమాను తలపిస్తోంది. తాను చనిపోతానని తెలిసినా అతడు ఏ మాత్రం అధైర్యపడలేదు. తన విషయం తెలిసి బాధపడుతున్న తన వాళ్లకు ధైర్యం చెప్పాడు. చివరి క్షణాల వరకు అదే నిబ్బరంతో ఉన్నాడు. చావును కూడా నిద్రలా ఆహ్వానించాడు.
పెళ్లైన 8 నెలలకే ఉప్పెన లాంటి విషాదం..
ఖమ్మం జిల్లాకు చెందిన ఏపూరి హర్షవర్థన్ వృత్తి రీత్యా వైద్యుడు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో వైద్య సేవలు అందిస్తున్నాడు. అతడికి వైరా దగ్గరలోని మేనత్తగారి ఊరికి చెందిన సింధు అనే యువతితో ఫిబ్రవరి 12, 2020లో పెళ్లయింది. పెళ్ల తర్వాత ఫిబ్రవరి 29న హర్షవర్థన్ ఒక్కడే ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఏప్రిల్ మొదటి వారంలో భార్యను తన వద్దకు తెచ్చుకునేందుకు ఏర్పాట్లు చేశాడు. ఈ నేపథ్యంలోనే మార్చి 23 2020లో లాక్డౌన్ పడింది. దేశాలకు మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో సింధు ఆస్ట్రేలియా వెళ్లలేకపోయింది. హర్షకి పరిశుభ్రత అంటే ప్రాణం. స్వయంగా వంట చేసుకుని తినేవాడు. బాడీ ఫిట్ నెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు. ప్రతిరోజు జిమ్ చేసేవాడు. అక్టోబర్ 2020లో జిమ్లో ఎక్సర్సైజులు చేస్తుంటే ఆయాసంతో పాటు కొంచెం దగ్గు కూడా రావడం మొదలైంది. వైద్య పరీక్షలు చేయించుకోగా ఉప్పెన లాంటి విషయం ఒకటి తెలిసింది. హర్షకు లంగ్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.
శోక సంద్రంలో కుటుంబ సభ్యులు.. అగమ్య గోచరంగా సింధు జీవితం
హర్షకు లంగ్ క్యాన్సర్ అన్న సంగతి కుటుంబసభ్యులకు అతడి భార్యకు తెలిసింది. దీంతో వారు విలవిల్లాడిపోయారు. దాదాపు మూడు నెలల పాటు కన్నీరుమున్నీరుగా విలపించారు. పరుగున హర్ష వద్దకు వెళదామని అనుకున్నారు. కానీ, లాక్డౌన్ కారణంగా వీళ్లు అక్కడికి వెళ్లలేరు.. అక్కడినుంచి హర్ష ఇండియాకు రాలేడు. నిత్యం నరకం అనుభవించసాగారు. తాను చనిపోతానని అతడికి ముందే తెలిసినా.. కుటుంబసభ్యులకు మాత్రం ఈ విషయం చెప్పలేదు.ఏం కాదని, రోగం నయం అవుతుందని చెబుతూ వచ్చాడు. కానీ, భార్య సింధును ఓదార్చటం అతడి వల్ల కాలేదు. తాను చనిపోతే సింధు పరిస్థితి దారుణంగా తయారవుతుందని భావించాడు. విడాకులు ఇవ్వమని కోరాడు. అయితే, విడాకులు ఇవ్వటానికి సింధు అంగీకరించలేదు. లాక్డౌన్ ఎత్తివేయగానే ఆస్ట్రేలియాకు వచ్చి సేవలు చేస్తానని అంది. అతడు ఇందుకు ఒప్పుకోలేదు. భార్య భవిష్యత్తు గురించి ఆలోచించాడు. పెద్దలను ఒప్పించి విడాకులు తీసుకున్నాడు. భరణంగా పెద్ద మొత్తం ఇచ్చాడు.
చివరి సారిగా సొంత గడ్డకు..
లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అతడి తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వస్తామని అతడికి చాలా సార్లు చెప్పారు. ఇందుకు అతడు ఒప్పుకోలేదు. వ్యాధి కారణంగా తాను పడే కష్టాలు వారు చూసి తట్టుకోలేరని అతడు భావించాడు. మెల్ల మెల్లగా వారిని తన చావుకు సిద్ధం చేస్తూ వచ్చాడు. 2022 అక్టోబర్ నెలలో ఇండియాకు వచ్చాడు. ఖమ్మంలోని తన తల్లిదండ్రులు కుటుంసభ్యులను కలిశాడు. 15 రోజులు ఇంటి దగ్గరే ఉండి.. ఒకేరోజు తన తల్లిదండ్రులను అమెరికాలోని తన తమ్ముడి దగ్గరకు పంపాడు. తనకు ఆస్ట్రేలియాలోనే మెరుగైన వైద్యం లభిస్తుంది అని చెప్పి తను ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియాలో 100 మందికి పైగా అనాధలు ఉన్న ఆశ్రమంలో వైద్య సేవలు అందించాడు.
చివరి రోజుల్లో కూడా అదే నిబ్బరంతో..
మార్చి 27, 2023కు ముందుగానే హర్ష చనిపోబోతున్నట్లు వైద్యులు ఓ డెత్ డేట్ను ఇచ్చారు. దీంతో హర్ష తన అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ముందుగానే చేసుకున్నాడు. చివరి క్షణాలు రానే వచ్చాయి. మార్చి 24వ తేదీన ఉదయం బ్రౌన్ కలర్ జాకెట్.. తెల్లటి పాయింట్.. తెల్లటి షూ ధరించి చక్కగా తయారయ్యాడు. తన స్నేహితులతో కలిసి చాలాసేపు తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడాడు. కొన్ని గంటల తర్వాత మూత్ర విసర్జన కోసం వాష్ రూమ్కు వెళ్ళగా మూత్రం బదులు రక్తం రావడం మొదలైంది. ఇదే విషయాన్ని స్నేహితులకు చెప్పాడు.
'' నేను మరొక గంట కంటే ఎక్కువ సేపు మీ ముందు ఉండలేను'' అని అన్నాడు. రెస్ట్ తీసుకుంటా అని పడుకున్నాడు. సరిగ్గా రెండు నిమిషాల తర్వాత 32 సంవత్సరాల హర్షవర్ధన్ నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. చనిపోతూ ఓ గొప్ప జీవిత సత్యాన్ని లోకానికి చెప్పిపోయాడు. జీవితం చాలా చిన్నది.. సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి. వాటి గురించి బాధపడి ఆత్మహత్య చేసుకోవాలనుకోవటం మూర్ఖత్వం. చావు తథ్యం అని తెలిసినా.. చివరి వరకు నిబ్బరంగా పోరాడిన హర్ష నిజంగా ఓ గొప్ప వ్యక్తి. ఆయన చనిపోయినా అందరి మనసుల్లో బతికే ఉంటాడు.
0 Comments:
Post a Comment