SSC Exams: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వ విభాగాలు/శాఖల్లో వివిధ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ పరీక్షల షెడ్యూలును మార్చి 29న ప్రకటించింది.
షెడ్యూలు ప్రకారం మల్టీ టాస్కింగ్ స్టాఫ్-2022 పరీక్షను మే 2 నుంచి 19 వరకు, జూన్ 13 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు ఎస్ఎస్సీ తెలిపింది. అలాగే సబ్ఇన్స్పెక్టర్(ఢిల్లీ పోలీస్), సీఆర్పీఎఫ్-2022(టైర్-2) పరీక్షను మే 2న, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్-2022(టైర్-2) పరీక్షను జూన్ 26న నిర్వహించనున్నారు. ఇక సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామ్-2023 జూన్ 27 నుంచి 30 వరకు, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్-2023(టైర్-1)ను జులై 14 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు ఎస్ఎస్సీ స్పష్టం చేసింది.
మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఫలితాలు వెల్లడి..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)-2021 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఎంటీఎస్ (నాన్-టెక్నికల్), హవాల్దార్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు. ఏప్రిల్ 6న అభ్యర్థుల మార్కుల వివరాలను అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు ఏప్రిల్ 20 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల అర్హతలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. మొత్తం మూడు జాబితాల్లో ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో మొదటి జాబితా(లిస్ట్-1)లో ఎంటీఎస్ (నాన్-టెక్నికల్) ఉద్యోగాలకు, రెండో జాబితా(లిస్ట్-1)లో హవల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. ఇక మూడో జాబితాలో ఫలితాలు పెండింగ్లో ఉన్న అభ్యర్థుల వివరాలు ఉన్నాయి.
మొత్తం 7518 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకుగాను 7494 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో 3910 మంది మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు, హవల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) పోస్టులకు 3584 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో 126 మంది అభ్యర్థుల నియామకాలకు వేర్వేరు కారణాలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పెండింగ్లో ఉంచింది.
0 Comments:
Post a Comment