గుజరాత్ రాష్ట్రం సూరత్లోని ఓ ఆలయంలో బంగారు రామాయణాన్ని చూడవచ్చు. ఇందులో ఉన్న అక్షరాలను 19 కిలోల బంగారంతో తయారు చేశారు.
ఈ బంగారు మహాకావ్య రచనకు 530 పేజీలను ప్రత్యేకంగా జర్మనీ నుంచి తెప్పించారు.
222 తులాల బంగారు సిరా వినియోగించారు. పుస్తకం బరువు సుమారు 19 కిలోల వరకు ఉంటుంది.
బంగారంతోపాటు 10 కిలోల వెండి, 4 వేల వజ్రాలు, కెంపులు, పచ్చలు, నీలమణులతో ఈ రామాయణాన్ని చూడముచ్చటగా అలంకరించారు. దీని విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది.
ఈ రామాయణ రచనకు 1981లో రామ్భాయ్ అనే భక్తుడు ప్రత్యేకించి పుష్యమీ నక్షత్రంలో శ్రీకారం చుట్టారు. రాయడానికి మొత్తం 9 నెలల 9 గంటల సమయం పట్టింది.
ఈ మహాయజ్ఞంలో మొత్తం 12 మంది రామభక్తులు సహకరించారు.
శ్రీరామనవమి రోజున మాత్రమే భక్తుల దర్శనం కోసం ప్రదర్శించే ఈ రామాయణాన్ని ఆ తర్వాత ఏడాదంతా ప్రత్యేక బ్యాంకులో భద్రపరుస్తారు.
0 Comments:
Post a Comment