చైత్ర నవరాత్రుల వేళ దేశంలోని భక్తులు వివిధ ఆలయాలకు క్యూ కడుతున్నారు..
దేశంలోని ప్రతి మూలా ఏదో ఒక రూపంలో కోలువై ఉన్న తల్లి దీవేనల కోసం భారీగా తరలివెళ్తున్నారు.
మధ్యప్రదేశ్ లోని నర్మదాపురంలో బగ్లాముఖి అమ్మవారి ఆలయం చాలా ఫేమస్. ఇక్కడ తలకిందులుగా ఉన్న సింహంపై కూర్చుని తల్లి ఉంటుంది
బగ్లాముఖి అమ్మవారి పురాతన ఆలయంలో దేవత సింహంపై కూర్చుని ఉంటుంది. నేటికీ తాంత్రికులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. ఇక్కడ జగదాంబ రూపంలో ఉన్న బగ్లాముఖి మాత పురాతన విగ్రహం ఉంది. 175 సంవత్సరాల క్రితం అప్పటి పచ్మర్హి రాణి మహల్ జగదాంబ విగ్రహాన్ని స్థాపించింది. ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకోవడానికి నేటికీ పులులు ఇక్కడికి వస్తాయని చెబుతారు.
అమ్మవారు ప్రతి భక్తుని కోరికలను తీరుస్తుందని భక్తులు చెబుతున్నారు. సంతానం కోసం దంపతులు ఇక్కడికి వస్తారని, వారి కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
గుడి బయట ఒక రాయి ఉంటుంది. నవరాత్రులలో ఒకసారి అర్థరాత్రి పులి తప్పకుండా వస్తుంది. తల్లిని చూడగానే తిరిగి వెళ్ళిపోతుంది. గుడి ముందు చాలా సార్లు పులి వచ్చినా అమ్మవారి దయ వల్ల అది మనకు హాని చేయదట.
నిజానికి అమ్మవారికి సంబంధించి దేశంలోని అనేక ఆలయాల్లో ఏదో ఒక అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి.. అవి ఎందుకు జరుగుతాయన్నది అంతబట్టని విషయం..
ఇక చైత్ర నవరాత్రులు ముగింపు దశకు చేరుకున్నాయి.. మార్చి 22న ప్రారంభమైన నవరాత్రులు రేపటితో ముగియనున్నాయి.
0 Comments:
Post a Comment