Good News: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్.. మార్చి 15 నుంచి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్.. పూర్తి వివరాలు ఇవే
Good News: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM Jagah Mohan Reddy).. సంక్షేమంపైనే పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు ఆయన పెద్ద పీట వేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే నాడు నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మారాయి. అలాగే పేద విద్యార్థులకు ఉన్నత చదువు అందించడమే లక్ష్యంగా అమ్మ ఒడి (Amma vodi) సహా పలు పథకాలను క్రమం తప్పకుండా అందిస్తున్నారు. మరోవైపు వైద్య రంగంలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఎంతటి ఖరీదైన వైద్యం అయినా.. పేదవాడికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఆరోగ్య శ్రీ (Arogya Sri) ద్వారా అనేక మందికి లబ్ధి చేకూరేలా చేస్తున్నారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే ఫ్యామిలీ డాక్టర్ (Family Doctor) .. తాజా వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కీలక నిర్ణయం తీసుకున్నారు.. మార్చి 15వ తేదీ నుంచి ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు..
అదేరోజు ఒక విలేజ్ క్లినిక్ దగ్గర ఈ విలేజ్ క్లీనిక్ ప్రారంభించనన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్టులో ఇప్పటివరకూ 45,90,086 మందికి ఆరోగ్య సేవలు అందించింది ప్రభుత్వం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలమేరకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సర్వం సిద్ధంగా ఉందని అధికారులు సీఎకు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1,149 పీహెచ్సీల్లో పూర్తిస్థాయిలో వైద్యుల నియమాకాలను పూర్తిచేశామని అధికారులు వివరణ ఇచ్చారు. అలాగే దీర్ఘకాలిక సెలవుల సమయంలో సేవలకు అంతరాయం లేకుండా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలమేరకు సీహెచ్సీల్లో ఉన్న వైద్యులను ఇక్కడ వినియోగించుకుంటామని, దీనికోసం అదనపు నియామకాలకు కూడా చేశామని చెప్పారు. అలాగే ప్రతి జిల్లాకు నలుగురు అదనపు వైద్యులను దీనికోసం నియమించుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఇతర స్వల్పకాలిక సమయాల్లో కూడా వైద్యసేవలకు అంతరాయం లేకుండా ప్రతి 6-7 పీహెచ్సీలకూ ఒక డాక్టర్ను అదనంగా నియమించారు.
రాష్ట్రవ్యాప్తంగా 175 మందిని రిజర్వ్లో పెట్టుకున్నామన్నారు.. 10,032 విలేజ్హెల్త్ క్లినిక్స్లో ప్రతి క్లినిక్కూ ఒక ఏఎన్ఎం చొప్పున ఉంటారు. వీరితో పాటు ఒక సీహెచ్ఓ, 3-4 మంది ఆశా కార్యకర్తలు ఉంటారు. విలేజ్హెల్త్క్లినిక్స్, అలాగే 104లలో ఉంచే మందుల సంఖ్యను కూడా పెంచామని తెలిపిన అధికారులు. సీఎం ఆదేశాల మేరకు అవసరమైన అన్నిరకాలు మందులు ఉండాలన్న లక్ష్యంతో ఇదివరకు ఇస్తున్న 67 రకాల మందులను 105కు పెంచామని వెల్లడించారు. అలాగే 14 రకాల డయాగ్నోస్టిక్ కిట్లను కూడా విలేజ్క్లినిక్స్కు అందుబాటులో పెట్టామని తెలిపారు.
0 Comments:
Post a Comment