AP Govt Good News to Employees
ఉగాది పండుగ వేళ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
ఉగాది పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రాష్ట్రంలో ఎక్కడైనా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో ప్రభుత్వ ఉద్యోగులు ఫ్లాట్ కొనుగోలు చేసుకోవచ్చు.
రాష్ట్రంలో ఎక్కడ పని చేస్తున్న వారు అయినా వారు కోరుకున్న చోట ప్లాట్ తీసుకోవచ్చు. గతంలో ఉద్యోగులు పని చేస్తున్న ప్రాంతంలో ఉన్న జగనన్న టౌన్ షిప్ లలో మాత్రమే కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉండేది. అయితే ఉద్యోగుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిబంధనలను సడలిస్తూ జీవో 38ని విడుదల చేసింది. రాష్ట్రంలో 22 నగరాలు, పట్టణాల్లో అన్ని అనుమతులు, ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లను అభివృద్ధి చేసింది. వీటిని మార్కెట్ ధర కంటే తక్కువకే అందుబాటులో ఉంచింది. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
అన్ని లేఆవుట్ లలో ప్రభుత్వ ఉద్యోగులకు పది ప్లాట్లు రిజర్వ్ చేయడంతో పాటు ధరలో 20 శాతం రిబేట్ సౌకర్యం కూడా కల్పించింది. తాజా నిబంధనలతో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు వీలు కలుగుతోంది. మొత్తం 22 జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ప్లాట్ బుక్ చేసుకునే సదుపాయం కల్గడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లేఅవుట్ వివరాలను https://migapdtcp.ap.in/ వెబ్ సైట్ లో చూడవచ్చు.
0 Comments:
Post a Comment