AP Budget 2023-24: పిల్లలు, స్త్రీలకు ప్రత్యేక కేటాయింపులు.. నవరత్నాలకు పెద్దపీట.. ఏపీ వార్షిక బడ్జెట్ లెక్క ఇదే..
AP Budget 2023-24: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) 2023-24 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana Rajendranath Reddy) ప్రవేశ పెట్టారు..
అయితే ిఈ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ కావడం.. ఏడాదిలోనే ఎన్నికలు ఉండడంతో.. బడ్జెట్ లో సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్టు కనిపించింది. ముఖ్యంగా నవరత్నాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పాటు మహిళలు పిల్లలకు ప్రత్యేక కేటాయింపులు చేశారు. 2023-24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు. మొదట పోతన భగవత పద్యాన్ని చదివి వినిపించారు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ కవితను ఉదహరించిన మంత్రి రాజేంద్రనాథ్ తరువాత బడ్జెట్ కేటాయింపులను చదివి వినిపంచారు. ముఖ్యంగా అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ ను ప్రవేశ పెడుతునట్టు చెప్పారు.
ఈ బడ్జెట్ లో వైఎస్సార్ పెన్షన్ కానుక కోసం .21,434.72 కోట్ల రూపాయలు, వైఎస్సార్ రైతు భరోసా కోసం 4,020 కోట్ల రూపాయలు, జగనన్న విద్యాదీవెన కోసం 2,841.64 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన కోసం 2,200 కోట్లు, వైఎస్సార్- పీఎం బీమా యోజన కోసం 1600 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం 1,000 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాల కోసం 500 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తానికి 550 కోట్లు కేటాయింపులు చేసినట్టు వెల్లడించారు.
ఇంకా మంత్రి ఏమన్నారంటే.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 4.25 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతోంది అన్నారు. సరుకుల పంపిణీ 84 శాతం నుంచి 94 శాతానికి పెరుగుదల ఉందన్నారు. ఎవరైనా దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే రేషన్ కార్డుల జారీ చేస్తున్న ఘనత మన ప్రభుత్వానిది అన్నారు. ఇప్పటి వరకు 48.75 లక్షల దరఖాస్తుల పరిష్కరించామన్నారు. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటుచేశామని. ప్రభుత్వ పాఠశాలలకు సమీపంలోనే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. అలాగే విద్యార్థులకు మెరుగైన భోజనం కోసం అదనంగా వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమానికి 3,951 కోట్లు కేటాయించమన్నారు. సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు అన్నారు.
అలాగే రాష్ట్రం స్థూలవృద్ధిలో మొదటి స్థానంలో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ వృద్ధి 11.43 శాతం ఉందన్నారు. సుస్థిర అభివృద్ధిలో నవరత్నాలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు. రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం తమది అన్నారు. పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉందన్నారు. 16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నామన్నారు. గతేడాది 18.39 కోట్ల పనిదినాలు కల్పించామన్నారు. వైఎస్సార్ జలకళ కింద 17,047 బోరు బావులు తవ్వామన్నారు. కుళాయి కనెక్షన్ల ద్వారా 65 లక్షల ఇళ్లకు మంచినీరు అందిస్తున్నామన్నారు. మౌలిక వసతులు, సేవలు మెరుగుపరిచే మోడల్ పట్టణాలుగా మంగళగిరి, తాడేపల్లి ఉన్నాయన్నారు.
విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, 175 నియోజకవర్గాల్లో 192 నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఐటీఐలో నైపుణ్యాభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి ఉందన్నారు. చురుగ్గా 67 క్రీడా వికాస కేంద్రాల నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. పర్యాటక రంగంలో 22 వేల కోట్లతో ఒప్పందాలు. ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా 13.42 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. దీని ద్వారా 6 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు. అలాగే 378 ఎంవోయూలు కుదుర్చుకున్నామన్నారు.
ఏపీ వార్షిక బడ్జెట్ 2023-కేటాయింపులు ఇవే:
జగనన్న చేదోడు రూ.350 కోట్లు
వైఎస్సార్ వాహనమిత్ర రూ.275 కోట్లు
వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
వైఎస్సార్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు
అమ్మ ఒడి రూ.6,500 కోట్లు
డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
ధర స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ రూ. 1,212 కోట్లు
వైఎస్సార్ పెన్షన్ కానుక- రూ.21,434.72 కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా రూ.4,020 కోట్లు
జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు
జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు
వైఎస్సార్- పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు
డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
వైఎస్సార్ కాపు నేస్తం- రూ. 550 కోట్లు
ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం
జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం
రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు
మూలధన వ్యయం రూ.31,061 కోట్లు
రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు
ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
జగనన్న తోడు- రూ.35 కోట్లు
ఈబీసీ నేస్తం-రూ.610 కోట్లు
వైఎస్సార్ కల్యాణమస్తు-రూ.200 కోట్లు
వైఎస్సార్ ఆసరా-రూ.6700 కోట్లు
వైఎస్సార్ చేయూత-రూ.5000 కోట్లు
మనబడి నాడు-నేడు రూ.3,500 కోట్లు
జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రూ.15,873 కోట్లు
పురపాలక,పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
స్కిల్ డెవలప్మెంట్ రూ. 1,166 కోట్లు
యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు
సామాజిక వర్గాల కేటాయింపు
షెడ్యూల్ కులాల సంక్షేమం-రూ.20,005 కోట్లు
షెడ్యూల్ తెగల సంక్షేమం-రూ. 6,929 కోట్లు
వెనుకబడిన తరగతుల సంక్షేమం- రూ. 38,605 కోట్లు
కాపు సంక్షేమం- రూ.4,887 కోట్లు
మైనార్టీల సంక్షేమం- రూ. 4,203 కోట్లు
పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం- రూ.2,602 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ- రూ.9,118 కోట్లు
నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్)- రూ.11,908 కోట్లు
పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు
ఎనర్జీ- రూ.6,456 కోట్లు
గ్రామ, వార్డు సచివాలయ శాఖ- రూ.3,858 కోట్లు
గడపగడకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు
0 Comments:
Post a Comment