ఆర్డర్ వచ్చిందంటూ డెలివరీ బాయ్ ఇంటికొచ్చాడా.? ఓటీపీ చెప్పందంటూ మిమ్మల్ని అడిగాడా.? అదేంటి! ఏం బుక్ చేయకుండా ఆర్డర్ ఇంటికొచ్చిందేంటని అనుకునేలోపు..
డెలివరీ బాయ్ మీ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మొబైల్కు ఓటీపీ చెప్పండి చాలు అని నమ్మబలికేలా చేసి.. మీరు ఓటీపీ చెబితే.. ఇక అంతే సంగతులు.. మీ బ్యాంక్ అకౌంట్ లూటీ అయినట్లే.. అవునండీ! ఇది నిజం.. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయని ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
ఇప్పటికే ఓఎల్ఎక్స్లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలను మనం తరచూ చూస్తూనే ఉంటాం.
ఆ కోవలోనే ఇటీవల మీషో, క్వికర్ వినియోగదారులను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.
ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వకుండా మనకు ఎలాంటి వస్తువు ఇంటికి రాదని.. ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే అస్సలు చెప్పొద్దని అంటున్నారు.
ఒకవేళ మోసం జరుగుతున్నట్లు అనుమానమొస్తే.. వెంటనే సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయాలని అన్నారు.
ఇలాంటి మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే.. 9121211100 వాట్సాప్ నెంబర్కు ఫిర్యాదు చేయాలని ఏపీ సైబర్ క్రైమ్ ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment