పొంగలిని ఇష్టంగా తింటారు. ఉదయం పూట దీనిని అల్పాహారంగా తింటే ఆరోగ్యానికి కూడా మేలు. ఆలయాల్లో పొంగలిని ప్రసాదంగా ఎక్కువగా ఇస్తారు. మంచి వాసన, రుచిని కలిగి ఉంటుంది.
రోజూ ఒకే విధంగా తినేవారు.. కాస్త ఇలా ట్రై చేసి తింటే.. టెస్టీగా కూడా ఉంటుంది. అయితే కట్టె పొంగలి ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు
బియ్యం-ఒక కప్పు, పెసరపప్పు-ఒక కప్పు, నీళ్లు-4 కప్పులు, ఉప్పు-తగినంత, నెయ్యి-అర కప్పు, పచ్చిమిర్చి తరిగినవి-3, అల్లం తరుగు-ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు-రెండు, జీడిపప్పు-3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర-ఒక టేబుల్ స్పూన్, మిరియాలు-ఒక టేబుల్ స్పూన్, ఇంగువ-రెండు చిటికెలు.
ఎలా తయారు చేయాలి?
మెుదట బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. తగినన్ని నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత కళాయిలో పెసరపప్పును తీసుకోవాలి. మంటపై దోరగా వేయించుకోవాలి. ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టాలి.
తర్వాత.. అదే కళాయిలో నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసి కలపాలి. నీళ్లు వేడి అవుతాయి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యాన్ని, వేయించిన పెసరపప్పును వేసుకుని ఉడికించాలి.
బియ్యం, పెసరప్పు మెత్తగా ఉడికి దగ్గర పడుతుండగా.. మంటను చిన్నగా చేసుకుని మూత పెట్టేయాలి. ఇంకోవైపు మరో కళాయి తీసుకోవాలి. అందులో నెయ్యి వేసి వేడి చేయాలి.
నెయ్యి వేడి అయ్యాక పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు జీలకర్ర, మిరియాలు, ఇంగువ వేసి వేయించుకుని స్టౌవ్ ఆఫ్ చేయాలి.
తయారైన తాళింపును మూతపెట్టి ఉడికిస్తున్న పొంగల్ లో వేసి స్టౌవ్ ఆఫ్ చేసుకోవాలి. సరిగా దీనిని కలపాలి. పది నిమిషాలపాటు.. పక్కన పెట్టాలి. ఇప్పుడు వేడి వేడి కట్టె పొంగలి రెడీ అయింది. ఆ తర్వాత సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ ఆహా అంటారు. ఉదయం అల్పాహారంగా తీసుకోండి.
0 Comments:
Post a Comment