BOI: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
ముంబయి ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ ఇండియా… దేశవ్యాప్తంగా ఉన్న బీవోఐ శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 11 నుంచి 25లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, బృందచర్చలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వివరాలు:
1. జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్లో క్రెడిట్ ఆఫీసర్ (జీబీవో): 350
2. ఐటీ ఆఫీసర్ ఇన్ స్పెషలిస్ట్ స్ట్రీమ్(ఎస్పీఎల్): 150
మొత్తం ఖాళీల సంఖ్య: 500.
అర్హత: క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, ఐటీ ఆఫీసర్ ఖాళీలకు బీఈ, బీటెక్/ పీజీ(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.02.2023 నాటికి 20 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ప్రారంభ వేతనం: నెలకు రూ.36,000-రూ.63,840.
ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష, బృంద చర్చలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష విధానం: ఇంగ్లిష్ లాంగ్వేజ్(35 ప్రశ్నలు, 40 మార్క్లులు), రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్(45 ప్రశ్నలు, 60 మార్క్లులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్(40 ప్రశ్నలు, 40 మార్క్లులు), డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రెటేషన్(35 ప్రశ్నలు, 60 మార్క్లులు), ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ పేపర్- లెటర్ రైటింగ్ & ఎస్సే(2 ప్రశ్నలు, 25 మార్క్లులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 157 ప్రశ్నలు, 225 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
దరఖాస్తు రుసుము: రూ.850(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).
తెలంగాణ రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
ముఖ్యమైన తేదీలు…
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 11.02.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.02.2023.
0 Comments:
Post a Comment