తిరుమల శిలాతోరణంలో ఓ అరుదైన బల్లి కనిపించింది.. దీని గమనించిన టీటీడీ అధికారులు బంగారు బల్లి అని గుర్తించారు.
అయితే ఆ బంగారు బల్లిని చిడటానికి భక్తులు తరలి వస్తున్నారు.. గతంలో ఇదే ప్రాంతంలో కనిపించిదని మళ్ళీ చాల రోజుల తర్వాత అదే స్థానంలో బంగారు బల్లి కనిపించింది. ఇది చాలా అరుదైనదిగా చెబుతుంటారు.
శేషాచలం కొండల్లోనే ఈ బంగారు బల్లి జాతి సజీవంగా ఉంది. ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో గణనీయంగా పెరిగాయని చెబుతున్నారు.
తిరుమల ఆలయానికి 3 కి.మీ దూరంలోని చక్రతీర్థంలో ఈ బంగారు బల్లులు ఎక్కు వగా కనిపిస్తున్నాయి అని చెబుతారు. బంగారు బల్లిని దర్శించే భాగ్యం తిరుమల కొండల్లో కనిపిస్తుందనే చర్చ ఉంది.
బంగారు వర్ణంతో కనిపించే ఈ బల్లులు ఆకట్టుకుంటున్నాయి. కాలొడాక్టి లోడన్ ఇల్లింగ్ గోర్థోరన్ జాతికి చెందిన బంగారు బల్లి ఓసారి శ్రీలంకలో కనిపించింది. ఈ రెండు జాతులు ప్రపంచంలో మరెక్కడా ఉండవు అంటారు.
బంగారు బల్లి శాస్త్రీయనామం కాలొడాక్టి లోడస్ అరీస్. ఎక్కువగా రాత్రిళ్లలో సంచరించే నిశాచర జీవి కాగా.. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు, లేత పసుపురంగులో ఉంటుంది.
అంతేకాదు ఈ బల్లులు 150 మి.మీ. నుంచి 180 మి.మీటర్ల వరకు పొడవు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తుంటాయి. రాతి గుహల్లో ఎక్కువగా ఉంటాయి.
చీకటి పడిన తర్వాత మాత్రమే బయటకు వస్తాయంటున్నారు. అంతేకాదు ఈ బల్లులు ఒక్కోసారి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. ఈ బల్లుల అరుపుల శబ్దం చాలా వింతగానూ ఉంటుంది.
0 Comments:
Post a Comment