దొంగలు రోజు రోజుకు రాటు తేలుతున్నారు. రోజుకోకొత్త విధానంలో దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు గుట్టుచప్పుడు కాకుండా, యజమానులకు తెలియకుండా దోచుకున్న వారు..
ఇప్పుడు నిలబెట్టి నిలువు దోపిడీ చేసేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల వెలుగు చూస్తున్నాయి.
దోపిడీ దొంగలు కొత్తరకం దోపిడీకి తెరలేపారు. ప్రజల ఆశను ఆసరగా మార్చుకుని, నిలువునా దోచేస్తున్నారు.
రాత్రి వేళల్లో మొబైల్ లైట్ ఆన్ చేసి, రోడ్డు పక్కన కింద పడేస్తారు. ఆ తరువాత.. తమ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు కేటుగాళ్లు.
ఎందుకంటే.. ఈ టార్చ్ లైట్ వేసి ఉండటం వల్ల ఫోన్ ఉందని భావించి చాలా మంది తమ వాహనాలను రోడ్డు పక్కన నిలుపుతున్నారు.
ఆ ఫోన్ తీసుకుందామని అనుకునేలోపు.. ఆ పక్కనే మాటు వేసి ఉన్న దుండగులు.. సదరు వ్యక్తులపై అటాక్ చేసేస్తున్నారు.
విలువైన నగదు, వస్తువులు, మొబైల్స్, పర్స్లు కాజేస్తున్నారు. అంతేకాదు.. ఒక్కోసారి ప్రాణాలకు కూడా ముప్పు ఉండే అవకాశం ఉంది.
ఇలా రోడ్లపై టార్చ్ లైట్ వేసి ఉన్న ఫోన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు.
0 Comments:
Post a Comment