Railways: ట్రైన్ ప్యాసింజర్లకు గుడ్ న్యూస్.. వారికి అదిరే బెనిఫిట్!
Indian Railways | ట్రైన్ ప్యాసింజర్లకు తీపికబురు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా కీలక విషయాలను వెల్లడించారు. రైల్వే (Railways) టికెట్ బుకింగ్ రాయితీ అంశంపై కూడా స్పందించారు.
సీనియర్ సిటిజన్స్కు (Senior Citizens) మళ్లీ రాయితీ అందుబాటులోకి రావొచ్చు. అయితే ఇదివరకు ఎలా ఉందో రానున్న కాలంలో అదే రాయితీలు మాత్రం అందుబాటులో ఉండకపోవచ్చు. కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని వివరించారు.
మీడియా నివేదికల ప్రకారం చూస్తే.. ట్రైన్ ప్యాసింజర్లకు కల్పించే రాయితీ వ్యవస్థలో పూర్తిగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. రైల్వే బోర్డు కొత్త రూల్స్ను తీసుకువచ్చే అవకాశం ఉంది. కేవలం కొన్ని కేటగిరిలకు మాత్రమే ట్రైన్ టికెట్ రాయితీలను పరిమితం చేసే అవకాశం ఉంది. ఈ కొత్త రూల్స్ త్వరలోనే అమలులోకి రావొచ్చు. ఈ కొత్త నిబంధనల అమలులోకి వచ్చినా కూడా సీనియర్ సిటిజన్స్కు రాయితీ అందుబాటులో ఉండనుంది.
ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ సీనియర్ సిటిజన్స్కు ట్రైన్ టికెట్లపై రాయితీని ఎత్తివేసింది. కోవిడ్ వచ్చిన దగ్గరి నుంచి ఈ ఫెసిలిటీని తొలగించింది. మళ్లీ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే రానున్న కాలంలో సీనియర్ సిటిజన్స్కు మళ్లీ రాయితీ అందుబాటులోకి రావొచ్చు. అయితే గతంలో మాదిరి తగ్గింపు లభించకపోవచ్చు.
ట్రైన్ ప్యాసింజర్లకు ట్రైన్ టికెట్ ధరలో 53 శాతం తగ్గింపు లభించొచ్చు. దివ్యాంగులు, విద్యార్థులు, రోగులకు ఈ బెనిఫిట్ లభించే ఛాన్స్ ఉంది. ఇందులో సీనియర్ సిటిజన్స్ కూడా ఉండనున్నారు. అయితే ఒక్కో కేటగిరి ప్రకారం రాయితీ మారుతూ ఉండొచ్చు. అలాగే అన్ని క్లాస్లకు కాకుండా ఎంపిక చేసిన కేటగిరిలకు మాత్రమే తగ్గింపు వర్తించే ఛాన్స్ ఉంది. సీనియర్ సిటిజన్స్ విషయానికి వస్తే.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ వీరికి స్లీపర్, థర్డ్ ఏసీ టికెట్లపై రాయితీ కల్పించొచ్చని సిఫార్సు చేసింది. అలాగే సీనియర్ సిటిజన్స్కు రాయితీ గతంలో కన్నా కొంత మేర తగ్గొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి.
కాగా ఇకపోతే ఈరోజు ప్రధాని మోదీ కొత్త వందే భారత్ ట్రైన్ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ట్రైన్ బిలాస్పూర్, నాగ్పూర్ మధ్యలో ప్రయాణించనుంది. వారంలో ఆరు రోజులు ఈ ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. దేశంలో అందుబాటులోకి వచ్చిన ఆరో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇదే కావడం గమనార్హం. ఈ ట్రైన్లో ప్రయాణికులకు పలు రకాల సౌకర్యాలు లభించనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ట్రైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు.
0 Comments:
Post a Comment