సచివాలయ ఉద్యోగులకు షాక్
» హాజరుపై సర్కారు కొత్త మార్గదర్శకాలు
» మధ్యాహ్నం 2 గంటలకు అటెండెన్స్ క్లోజ్
» ఆయా శాఖల కార్యదర్శులకు వివరాలు
» ఆకస్మిక తనిఖీలు చేయనున్న సీఎస్
అమరావతి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): అమరావతిలోని రాష్ట్ర సచివా లయ ఉద్యోగులకు జగన్ సర్కారు షాక్ ఇస్తోంది. రోజువారీ హాజరు విష యంలో కొందరు ఉద్యోగులు, అధికారులు సమయపాలన పాటించడం లేదని, పనివేళల్లో సచివాలయంలో ఉండటం లేదనే కారణాలతో కొత్త మార్గ దర్శకాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రతిశాఖలో ఓపీ సెక్షన్ ఇన్చార్జి (ఎంఎ ల్వో) రోజూ మధ్యాహ్నం 2 గంటలకు సిబ్బంది హాజరును క్లోజ్ చేసి, ఆ వివరాలను ఆయా శాఖల కార్యదర్శులకు పంపాలని ఆదేశించింది. ప్రతిరోజు ఉద్యోగుల హాజరు నిర్ధారణ బాధ్యత సంబంధిత శాఖ కార్యదర్శిపైనే ఉంటుం దని స్పష్టం చేసింది. అలాగే ఉద్యోగుల హాజరుపై ఇక నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని పేర్కొంది. ఈ ఆదేశాలను ప్రతి శాఖ కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. సాధారణ పరిపాలన విభాగం ఉన్నతాధికారులు తాజాగా సచివాలయంలోని అన్ని శాఖలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం పనివేళల్లో ఉద్యోగులు అందు బాటులో ఉండాలని ప్రభుత్వ పెద్దలు గతంలో పలుమార్లు మౌఖికంగా ఆదే శాలిచ్చారు. కేబినెట్, అసెంబ్లీ సమావేశాలప్పుడు మినహా సీఎంతో పాటు పలువురు మంత్రులు, కొందరు ఐఏఎస్ అధికారులు క్యాంప్ ఆఫీసులకు పరి మితమవుతున్న నేపథ్యంలో కొందరు ఉద్యోగులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించ డాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసి నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
0 Comments:
Post a Comment