క్లౌడ్ బరస్ట్ వెనుక విదేశాల కుట్ర ఉందన్న సీఎం కేసీఆర్
మేఘ విస్పోటనం అంత ఈజీ కాదంటున్న నిపుణులు
గతంలో మేఘమథనం ప్రయత్నాలు విఫలమైనట్లుగా వెల్లడి
వాతావరణంలో మార్పుతోనే గోదావరి ఉత్పాతమని వెల్లడి
క్లౌడ్ బరస్ట్ సాధ్యమేనా..
క్లౌడ్ బరస్ట్cloud bursts (మేఘ విస్ఫోటనం) అనే కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని వెనుక ఏదో కుట్రలున్నాయని చెబుతావున్నరు.. అది ఎంత వరకు కరెక్టో తెలియదు.. కానీ, ఇతర దేశాల వాళ్లు కాదలచుకొనే మనదేశంలో అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్లు చేస్తున్నారు.
గతంలో ఒకసారి కశ్మీర్Kashmir దగ్గర లేహ్Leh , ఆ తర్వాత ఉత్తరాఖండ్Uttarakhandలో చేశారు. ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతంలో చేస్తున్నరని మనకు గ్లూమీ గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం.
ఏమైనప్పటికీ వాతావరణంలో సంభవించేటటు వంటి మార్పుల వల్ల ఇటువంటి ఉత్పాతాలు వస్తా ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంలో మనం ప్రజలను కాపాడుకోవాల్సి ఉంటది.'' అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)భద్రాచలం(Bhadrachalam)లో ఆదివారం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
వ్యాఖ్యలపై నిపుణుల వివరణ ..
ఐటీడీఏలో ఏర్పాటు చేసిన గోదావరి వరదల సమీక్ష 2022లో సీఎం వరద ఉత్పాతాన్ని క్లౌడ్ బరస్టు కుట్రగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసలు క్లౌడ్బరెస్టు సాధ్యాసాధ్యాలపై సందేహాలు నెలకొన్నాయి.
దీనిపై ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్(SR&BGNR)డిగ్రీ కళాశాల భౌతికశాస్త్ర విభాగం ప్రధాన అధ్యాపకులు డాక్టర్ నర్సింగ్ శ్రీనివాసరావు విశ్లేషించారు. ఒక నిర్ధిష్ట ప్రదేశంలో భారీగా వర్షం.. ఒక ధారలా పడి కాసేపట్లో భారీ వరదలు ఉత్పన్నమైతే అది క్లౌడ్ బరెస్టు ప్రభావంగా భావించొచ్చని తెలిపారు.
ఆ వరదలకు ఒక్కోసారి సొరంగాల వంటివి కూడా ఏర్పడతాయని పేర్కొన్నారు. సాధారణంగా వర్షం గంటకు 70 మి.మీ పడితే భారీ వర్షంగా భావిస్తాం... క్లౌడ్ బరస్టు జరిగినప్పుడు మాత్రం అది గంటకు 100 మి.మీ కంటే ఎక్కువగా కుండపోతగా కురుస్తుందంటున్నారు నిపుణులు.
క్లౌడ్ బరస్టు వెనుక..
ఈ తరహా క్లౌడ్ బరస్ట్లు ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో చోటు చేసుకుంటాయి. పైకి వెళ్లిన నీటి ఆవిరి లిక్విడ్గా మారి గాలి వాటాన్ని బట్టి సంభవిస్తుంటాయి. అయితే ఇవి ఫలానా చోటే నిర్ధిష్టంగా సంభవిస్తాయని మాత్రం చెప్పలేమంటున్నారు డాక్టర్ నర్సింగ్ శ్రీనివాసరావు.
దీని వల్ల వచ్చే వరదలకు ఇండ్ల్లు పునాదులతో సహా కొట్టుకుపోతాయని తెలిపారు. ఆ మధ్య ఉత్తరాంచల్లో వచ్చిన క్లౌడ్ బ్లాస్టింగ్ను అవలాంచ్ (హిమపాతం)గా తేల్చారు.
ఇవి ఎక్కువగా హిమాచల్ప్రదేశ్ కొండ ప్రాంతాల్లో చోటుచేసుకుంటాయని అభిప్రాయపడ్డారు. పెహల్గామ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్లో ఇటువంటి వర్షాలు చోటు చేసుకున్నాయి.
నిర్ధిష్ట ప్రదేశంలో క్లౌడ్ బరస్ట్లు చేయలేం...
కృత్రిమంగా క్లౌడ్ బరస్టు చేయవచ్చా.. అంటే చేయవచ్చు. కానీ ఎంపిక చేసిన చోట వర్షం పడటం అసాధ్యం. మేఘాల్లోకి కార్బన్డయాక్సైడ్, సోడియం క్లోరైడ్, మరీ ముఖ్యంగా సిల్వర్ అయోడెడ్ పంపుతారు.
దీనివల్ల మేఘాలు చల్లగా మారి 20-30 కి.మీ విస్తీర్ణంలో వర్షాలు పడుతాయి. గంటకు 10 సెం.మీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ కృత్రిమ మేఘ విస్ఫోటనం వికటించే అవకాశాలే ఎక్కువ. గతంలో బెంగళూరులో వర్షాల కోసమని సిల్వర్ అయోడెడ్ను పంపారు.
ఆ రుతుపవనాల ప్రభావం చెన్నైపై పడిందని పరిశీలకుల మాట. భూతలం నుంచి వెయ్యి మీటర్ల ఎత్తులో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రుతుపవనాలు మనం ఎంపిక చేసుకున్న చోట సంభవిస్తాయని చెప్పలేమంటున్నారు.
మేఘమథనం కూడా ఇటువంటిదే...
తక్కువ వర్షపాతం ఉన్న చోట మేఘ మథనం వంటివి చేస్తుంటారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అప్పటి వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి 100 కోట్లు వెచ్చించి కర్నూల్ వంటి చోట మేఘ మథనం ద్వారా కృత్రిమ వర్షం కోసం ప్రయత్నాలు జరిగాయి.
కానీ అదో విఫలయత్నమే అయ్యింది. ఇప్పటికీ దీనిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. వాతావరణంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలే ఈ ఉత్పతాలకు కారణం కానీ మేఘ విస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్ట్) వంటివి అంత ఈజీగా సక్సెస్ కావంటున్నారు నిపుణులు.
అవి కూడా వ్యక్తులు ఎంచుకున్న చోట సంభవించవని..వాతావరణంలో మార్పులే వరదలకు ప్రధాన కారణమని భౌతికశాస్త్ర విభాగం అధ్యాపకులు తమ విశ్లేషణ ద్వారా వ్యక్త పరుస్తున్నారు.
0 Comments:
Post a Comment