Last Village of Indian: ఇప్పటికీ వెలుగు చూడని ఎన్నో రహస్యాలు, మరెన్నో సహజ వనరులు, పౌరాణిక సంప్రదాయాల నెలవు మన భారతదేశం. దేశంలో అనేక రహస్యాలతో కూడిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.
అలాంటి ప్రదేశాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉంటుంది. మనం దేశంలో కొన్ని లక్షల గ్రామాలు ఉన్నాయి. అందుకే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మ అని అంటారు.
అయితే, భారతదేశంలోని చివరి గ్రామం ఏది? అంటే సమాధానం చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే.. దాని గురించి ఎవరూ పెద్దగా ఆలోచించరు. అయితే, ఇవాళ మనం భారతదేశంలో చివరి గ్రామం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలోని చివరి గ్రామం పేరు 'మనా'. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ గ్రామాన్ని ఎప్పుడైనా సందర్శించవచ్చు. బద్రీనాథ్ స్వామిని దర్శించుకోవడానికి ఎప్పుడు వెళ్లినా ఆ గ్రామానికి వెళ్లొచ్చు.
ఎందుకంటే.. బద్రీనాథ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఆ గ్రామం ఉంటుంది. ఈ గ్రామం బద్రీనాథ్ నుండి మూడు కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీనినే భారతదేశంలోని చివరి గ్రామం అని పిలుస్తారు.
ఈ గ్రామంతో మహాభారతానికి కూడా సంబంధం ఉందని చెబుతారు పెద్దలు. ఈ నేపత్యంలో భారతదేశంలోని చివరి గ్రామానికి సంబంధించిన ప్రత్యేక విషయాలను ఇప్పుడు చూద్దాం.
'మనా' గ్రామ జనాభా..
గ్రామంలో దాదాపు 60 ఇళ్లు, 400 మంది జనాభా ఉన్నారు. చాలా ఇళ్లు చెక్కతో చేసినవే. పైకప్పు రాతి పలకలతో ఉంటుంది. ఈ ఇళ్లు భూకంపాలను సైతం సులభంగా తట్టుకోగలవు.
ఈ గ్రామంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఆయుర్వేద మూలికలు లభిస్తాయి. వీటన్నింటితో పాటు గణేష్ గుహ, వ్యాస గుహ కూడా ఇక్కడ చూడదగ్గవి. ఈ గుహలోనే మహాభారత రచన జరిగిందని చెబుతారు.
ఈ గ్రామం నుండే స్వర్గానికి పాండవులు..
మనా గ్రామం నుంచే పాండవులు స్వర్గానికి వెళ్లారని హిందూమత గ్రంధాల్లో పేర్కొనడం జరిగింది. పాండవులు స్వర్గానికి వెళ్లేందుకు ఈ గ్రామానికి చేరుకున్నప్పుడు, ఇక్కడ ప్రవహించే సరస్వతి నది గుండా ఒక మార్గం కనుగొన్నారు.
ఆ మార్గంలో అవాంతరాలు ఏర్పడటంతో భీముడు రెండు పెద్ద రాళ్లను తీసుకువచ్చి నదికి అడ్డంగా వేసి వంతెనను నిర్మించాడు. ఈ వంతెన ద్వారా వారు నది మీదుగా స్వర్గానికి వెళ్లారు.
నేటికీ సరస్వతి నది ఆ ప్రదేశం గుండా ప్రవహిస్తుంది. ఇది అలకనందలో కలుస్తుంది. నేటికీ ఆ రాతి వంతెన నదిపై ఉంది. ఈ వంతెనను 'భీంపుల్' అని పిలుస్తారు.
0 Comments:
Post a Comment