🏤పాఠశాలల విలీనంపై జిల్లాగా ప్రత్యేక కమిటీలు పునరాలోచనలో ప్రభుత్వం
ఈనాడు , అమరావతి : ప్రభుత్వ పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుం డడంతో మరోసారి పరిశీలనకు జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు . ప్రధాన రహదారులు , రైల్వే క్రాసిం .. గ్లు , వాగులు , వంకలు దాటి వెళ్లాల్సి వస్తున్న వాటిని . పరిశీలించాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు . ఇందు కోసం మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు . పాఠశాలల విలీనాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించ డంతోపాటు ఇటీవల 70 మంది ఎమ్మెల్యేలు విలీనం నిలి పివేయాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు లేఖలు రాశారు . జిల్లా కలెక్టర్లకు ఎమ్మెల్యేలు వినతులు సమర్పిం చారు . ఈ నేపథ్యంలో విలీనంపై ప్రభుత్వం పునరాలోచ నలో పడింది . దీంతో కలెక్టర్ల ద్వారా ప్రత్యేకంగా పరిశీ లన చేపట్టారు . కడప జిల్లాలో మండల స్థాయిలో ఎంపీ డీవో , ఎమ్మార్వో , సర్వేయర్ , ఎంఈవోలతో కమిటీని ఏర్పాటు చేశారు . నంద్యాలలోనూ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు . ప్రాథమిక పాఠశాలల నుంచి 34,5 తర గతులను కిలోమీటరు దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తుండగా .. ప్రాథమికోన్నత బడుల నుంచి 6,7,8 తరగతులను ఉన్నత బడుల్లో కలిపేస్తున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా 5,250 పాఠశాలలను విలీనం చేస్తుంది .వీటిల్లో 270 పాఠశాలల్లో వాగులు , వంకలు , రహ 6:06 ( 44 దారులను దాటి వెళ్లాల్సి వస్తున్నట్లు అధికారులు గుర్తిం చారు . కానీ క్షేత్రస్థాయిలో కిలోమీటరు కంటే దూరంలోని ప్రాథమిక బడుల నుంచి 3,4,5 తరగతులను విలీనం చేస్తున్నారు . వాగులు , వంకలు , రహదారులను పట్టించు కోవడం లేదు . పాఠశాలల తరలింపు , వాగులు , వంకలు , రహదారులు దాటి బడికి వెళ్లాల్సి రావడాన్ని తల్లిదం డ్రులు , గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు .
0 Comments:
Post a Comment