ఇంట్లో పాటించాల్సిన నియమాలు
అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి
ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి
నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతి దీపం పెట్టాలి
శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి
పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు..
ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చో కూడదు, నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వెలుపైన తిప్ప కూడదు మధ్య వేలు తోనే చేయాలి.
జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు, మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు..
ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించ కూడదు....
దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళు దగ్గరకు ,పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్లకూడదు...
షష్ఠి, అష్టమి, త్రయోదశి రోజు తలకు నూనె రాసుకోకూడదు, రాత్రిపూట చిక్కు తీయకూడదు
వారంలో ఒక్కసారైనా పులిహోర చేసి దేవుడికి నైవేద్యం పెడితే ఇంట్లో అంతా మంచి జరుగుతుంది
రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు
ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటూ వంట చేయకూడదు. తినే వారు కూడా తిట్టుకుంటూ తినకూడదు. తిట్టుకుంటూ తినే భోజనం శక్తిని ఇవ్వకపోగా రోగానికి హేతువు. ఇంకా చెప్పాలంటే భోజనాన్ని తిట్టుకుంటూ తినేకన్నా పూర్తిగా తినడం మానేయ్యడం మంచిది. కనీసం ఉపవాస ఫలితం అయినా దక్కుతుంది.
ఎప్పుడూ నిద్రపోతూ ఉండే వాడు, అసలు నిద్రపోకుండా ఉండే వాళ్ళు, ఎప్పుడూ తింటూనే ఉండే వారు, అసలు ఆహారం పై శ్రద్ద లేకుండా ఉపవాసాలు ఉండే వారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధార పడి బతికే వాళ్ళు, పంచమహా పాతకం చేసిన వారి కన్నా పెద్ద పాపాత్ములు
ఇంట్లో అతిధి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు...ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండవ సారి కాస్త అయినా పెట్టుకోవాలి.. అలా ఒక్కసారి లేస్తే ఆదిత్యం ఇచ్చిన ఫలితం దక్కదు..
ఇంట్లో తరచుగా సాంబ్రాణి పొగ వేస్తూంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది
0 Comments:
Post a Comment