విలీన ప్రక్రియ అయ్యిన వెంటనే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం
ఉపాధ్యాయ బదిలీలు కూడా పాఠశాలల సెలవులు ముగిసే లోపే పూర్తి ::: SCERT డైరెక్టర్ శ్రీ B ప్రతాపరెడ్డి గారు.
SCERT డైరెక్టర్ శ్రీ B ప్రతాపరెడ్డి గారిని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలసి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించే ప్రక్రియ త్వరిత గతిన ప్రారంభం అయ్యేలా కృషి చేయాలని కోరడం జరిగింది . వారు స్పందిస్తూ , జిల్లా పరిషత్ పాఠశాల లోనే జూనియర్ కాలేజీలు ప్రారంభం కానున్నాయని , స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్ లుగా , ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్ హోదా , SGT లకు స్కూల్ అసిస్టెంట్ లు గా పదోన్నతులు త్వరలో రావడం ఖాయమని తెలిపారు .. కిలోమీటరు పరిధిలోని పాఠశాలలు విలీన ప్రక్రియ అయ్యిన వెంటనే పదోన్నతుల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది అని తెలిపారు . అదేవిధంగా ఉపాధ్యాయ బదిలీలు కూడా పాఠశాలల సెలవులు ముగిసే లోపే పూర్తి అవుతాయని తెలియపరిచారు .
0 Comments:
Post a Comment