India Corona: మళ్లీ 8 వేలకుపైగా కొత్త కేసులు.. ముందురోజు కంటే 33 శాతం అధికంగా..!
53 వేలకు పైగా క్రియాశీల కేసులు
దిల్లీ: దేశంలో కరోనా వైరస్(coronavirus) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా మరోసారి 8 వేలకు పైగా కేసులు రాగా.. ముందురోజు కంటే 33 శాతం అధికంగా నమోదయ్యాయి. క్రియాశీల కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..
* మంగళవారం 4.40 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 8,822 మందికి వైరస్ సోకినట్లు తేలింది. క్రితంరోజు ఆ సంఖ్య 6,594గా ఉంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2 శాతానికి చేరింది. మహారాష్ట్రలో 2,956, కేరళలో 1,986, దిల్లీలో 1,118 మందికి కరోనా సోకింది. హరియాణా, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ విస్తరిస్తోన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ 4.32 కోట్ల మందికి పైగా మహమ్మారి బారినపడ్డారు.
* దీంతో క్రియాశీల కేసులు 53,637కి ఎగబాకాయి. మొత్తం కేసుల్లో వాటి వాటా 0.12 శాతానికి పెరిగింది.
* 24 గంటల వ్యవధిలో 5,718 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 98.66 శాతం మంది వైరస్ నుంచి బయటపడ్డారు. నిన్న 15 మంది మరణించగా.. మొత్తంగా 5.24 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
* ఈ ఏడాదిన్నర కాలంలో 195 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. అందులో నిన్న 13.58 లక్షల మంది టీకా తీసుకున్నారు.
0 Comments:
Post a Comment