Panipuri: పానీపూరి పేరు వినగానే నోటిలో నీళ్లు తిరుగుతాయి. ఇది ఒక ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్. నీరు, బంగాళదుంపలతో నింపిన పానీపూరీ చాలా రుచిగా ఉంటుంది.
వీటిని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిని బంగాళాదుంప, పప్పు, స్పైసి, స్వీట్ చట్నీతో అందిస్తారు. మహిళలు పానీపూరిని బాగా ఇష్టపడతారు.
దేశంలోనే కాకుండా విదేశాలకు చెందిన వారు భారతదేశంలో పానీపూరిని ఆస్వాదిస్తారు. కానీ ఇది ఎక్కడ నుంచి వచ్చింది.. ఎప్పుడు ప్రారంభించారు అనేది చాలా మందికి తెలియదు.
నిజానికి పానీపూరి గురించి చారిత్రక, పౌరాణిక కథనాలు ఉన్నాయి. పానీపూరి చరిత్రని వివరంగా తెలుసుకుందాం.
ద్రౌపది తొలిసారిగా పానీపూరి చేసింది
పానీపూరి మహాభారత కాలం నుంచి ఉంది. ద్రౌపది పాండవుల కోసం మొదటిసారిగా పానీపూరిని తయారుచేసింది. నిజానికి వివాహానంతరం ద్రౌపది పాండవులతో కలిసి తన అత్తమామల ఇంటికి వెళుతుంది.
అప్పుడు అత్తగారైన కుంతి తన కోడలు ద్రౌపదిని పరీక్షించడానికి ఒక టెస్ట్ పెడుతుంది. ఆ సమయంలో పాండవులు వనవాసంలో ఉంటారు.
తినడానికి పెద్దగా ఏమీ ఉండదు. ఆ పరిస్థితిలో కుంతి తన కోడలు ద్రౌపది ఇంటిని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తుందో పరీక్షించాలనుకుంది.
కుంతి ద్రౌపదికి మిగిలిపోయిన బంగాళదుంపలు, సుగంధ ద్రవ్యాలు, కొద్దిగా పిండిని ఇస్తుంది.
వీటితో రుచికరమైన వంటకాలు చేయమని చెబుతుంది. ఐదుగురు పాండవులకు నచ్చేలా ఉండాలని చెబుతోంది.
ఈ పరిస్థితిలో ద్రౌపది పిండితో చిన్న చిన్న పానీపూరిలను తయారు చేసి అందులో బంగాళాదుంపలు, వేడి నీటితో వడ్డిస్తుంది. ఈ ట్రిక్ పని చేస్తుంది.
తర్వాత పాండవులకు పానీపూరి ఇష్టమైన ఫుడ్గా మారిపోతుంది. దీంతో కుంతి సంతోషించి ద్రౌపదిని మెచ్చుకుంటుంది.
0 Comments:
Post a Comment