Sri Lanka Crisis: లీటర్ పెట్రోల్ ధర రూ.338.. ఉవ్వెత్తున నిరసనలు
కొలంబో: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ద్వీప దేశంలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం శ్రీలంక రూ.338కు చేరకుంది. అక్కడి చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్ఐఓసీ) పెట్రోల్ రేట్లను పెంచిన మరుసటి రోజే.. దానికి అనుగుణంగా శ్రీలంక ప్రభుత్వ చమురు సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీ) సైతం సోమవారం అర్ధరాత్రి ధరలను పెంచేసింది. 92 ఆక్టేన్ పెట్రోల్ ధరను రూ. 84 మేర అధికం చేసింది. ఫలితంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 338 చేరుకుంది.
శ్రీలంకలో గత ఆరు నెలల కాలంలో ఎల్ఐఓసీ ఇంధన ధరలను పెంచడం ఇది ఐదోసారి కాగా.. సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నెలరోజుల వ్యవధిలో రెండు సార్లు పెట్రోల్ రేట్లను పెంచింది. ఇప్పటికే ఇంధన, ఆహార, ఔషధ కొరతతో ఇబ్బందులు పడుతున్న లంకేయులను తాజా పెంపు మరిన్ని ఇబ్బందులకు గురిచేయనుంది.
మరోవైపు లంకలో సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అధ్యక్షుడు అతని కుటుంబం తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం ముందు సహా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల రహదారులను బ్లాక్ చేసి వాహనాలు, టైర్లకు నిప్పంటించారు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.
0 Comments:
Post a Comment