Solar Radiation: కొన్ని నెలలుగా, సూర్యుడిపై చోటుచేసుకుంటున్న చర్యలు భూమిపై ప్రతికూల ప్రభావానికి దారి తీస్తున్నాయి. ఏప్రిల్ 11న, సూర్యునిపై నల్లటి మచ్చలు ఉన్న ప్రాంతంలో బలమైన పేలుడు సంభవించింది.
పేలుడు తీవ్రత సౌర తుఫానుగా మారి భూమికి పాక్షిక ముప్పుగా పరిణమిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. పేలుడు నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా గురువారం లేదా శుక్రవారం భూమిపై భూఅయస్కాంత తుఫాను ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీంతో రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఎలక్ట్రానిక్ పరికరాలు పాడయ్యే అవకాశం ఉంది. భూ అయస్కాంత తుఫాను అనేది ఒక రకమైన సౌర తుఫాను. సూర్యుడి నుండి వెలువడే రేడియేషన్ కారణంగా మొత్తం సౌర వ్యవస్థను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని, భూమి చుట్టూ ఉన్న వాతావరణ శక్తిని కూడా ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) అనుబంధ సంస్థ స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ (SWPC) కూడా సౌర తుఫానుల గురించి హెచ్చరికను జారీ చేసింది. NOAA ప్రకారం, ఏప్రిల్ 14న స్వల్ప స్థాయి మరియు ఏప్రిల్ 15న మధ్యస్థాయి సౌర తుఫాను భూమిని ప్రభావితం చేస్తుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించిన వివరాలు ప్రకారం, సౌర తుఫాను G2 వర్గానికి చెందినది. ఈ స్థాయి తుఫాను G5 వలె అంత తీవ్రమైంది కాదు, కానీ పాక్షిక నష్టాన్ని కలిగిస్తుందని నాసా వర్గాలు వెల్లడించాయి.
గురువారం శుక్రవారం నాడు వెలువడే సోలార్ తుఫాను ప్రభావంతో భూమిపై మొబైల్ నెట్వర్క్ మరియు విద్యుత్ వోల్టేజీలలో అంతరాయాలు ఏర్పడతాయి. దీని కారణంగా, GPS సిగ్నల్ మరియు మొబైల్ నెట్వర్క్లో ఆటంకాలు సంభవించవచ్చు. భూ కక్ష్యలో కదులుతున్న ఉపగ్రహాలపైనా సౌర తుఫాను ప్రభావం ఉంటుంది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా రేడియో బ్లాక్అవుట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు పరిశోధకులు హెచ్చరించారు. ఈ బలమైన తుఫాను కారణంగా, కరెంటు కూడా పోతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల కారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతింటాయి, కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ పరికరాలను, గృహోపకారణాలను ఉపయోగించవద్దని నిపుణులు హెచ్చరించారు.
0 Comments:
Post a Comment