✍️అరగంట ఆలస్యమైనా.. టెన్త్ పరీక్షకు ఓకే
♦సరైన కారణాలుంటేనే..మంత్రి బొత్స ఆదేశం
🌻ఈనాడు, అమరావతి:
పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక పరిస్థితుల్లో ఉదయం 10 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభం కానుండగా.. విద్యార్థులు ఎవరైనా సహేతుకమైన కారణంతో ఆలస్యంగా వస్తే 10 గంటల వరకు అనుమతించాలని సూచించారు. ఈనెల 27 నుంచి పరీక్షలు మొదలుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం మంత్రి వర్చువల్గా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అన్ని పరీక్షా కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6,22,537 మంది పరీక్షలకు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. పాఠశాల విద్యపై నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ‘నాడు-నేడు’ కార్యక్రమం మొదటి విడతకు ప్రారంభోత్సవాలు, రెండో విడతకు శంకుస్థాపనలు వచ్చేనెల నుంచి చేయాలన్నారు.
♦హాల్టికెట్ ఉంటే ఉచిత ప్రయాణం
పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లి వచ్చేందుకు వీలుగా ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో పాస్లేకపోయినా ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి పరీక్షలు ఈనెల 27 నుంచి మే 9 వరకు జరగనుండగా.. ఈ సమయంలో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ఈడీ (ఆపరేషన్స్) బ్రహ్మానందరెడ్డి గురువారం అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పాస్ లేకపోయినా హాల్టికెట్ ఉంటే ప్రయాణానికి అనుమతించాలని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాల్లోని విద్యాశాఖ అధికారులను సంప్రదించి, అవసరమైన బస్సులు నడపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment