AP Weather: మార్చి మిడిల్ నాటికే ఎండలు దంచికొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలో భానుడు భగభగమంటున్నాడు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అలర్ట్ చేసింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను తెలిపింది.
ఈ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 670 మండలాలకు గాను బుధవారం మూడు మండలాల్లో తీవ్ర వడ గాలులు వీయగా, 43 మండల్లాల్లో వడగాలులు వీచాయి. తీవ్ర వడగాలులు వీచిన 3 మండలాలు విశాఖపట్నంలోనే ఉండడం గమనార్హం. ఇక రానున్న 24 గంటల్లో (17-03-2022) రాష్ట్రంలోని 8 మండల్లాల్లో తీవ్ర వడగాలులు, 93 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రానున్న 48 గంటల్లో (18-03-2022) రాష్ట్రంలోని 13 మండలాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. గురువారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఈ జిల్లాలు ఇవే.. విజయనగరం (2), తూర్పుగోదావరి (01), కృష్ణా (03), గుంటూరు (02) మండలాల్లో తీవ్ర వడ గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
0 Comments:
Post a Comment