✍శ్రేష్ఠ ద్వారా అత్యున్నత విద్య
♦ఏప్రిల్ 12లోపు దరఖాస్తు చేసుకోండి
♦సాంఘిక సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు
🌻అమరావతి, ఆంధ్రప్రభ*: శ్రేష్ఠ (స్కీం ఫర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హయ్యర్ క్లాస్స్ ఇన్ టార్గె టెడ్ ఏరియాస్) ద్వారా భారత ప్రభుత్వం ప్రతిభావంతులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు సిబిఎస్ఇ అఫిలియేటెడ్ రెసిడెన్సి యల్ స్కూల్స్ నందు పూర్తి ఉచిత ముగా అత్యున్నత ప్రమాణాలతో కూ డిన విద్య ని అందిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తెలిపారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తముగా 3000 మంది విద్యార్థు లకు 9 వ తరగతి, 11 వ తరగతిలో ప్రవేశం కోసం అవకాశం జరుగుతుందన్నారు.. షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల డ్రాప్ అవుట్ రేట్ కలిపించడం ను నియంత్రించే ప్రయత్నం లో భాగముగా అర్హులైన విద్యార్ధులకు ఈ అవకాశం ఉపకరిస్తుందని గంధం చంద్రుడు పేర్కొన్నారు. 9 వ తరగతి లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు 11 వ తరగతి వరకు, 11 వ తరగతి లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు 12 వ తరగతి వరకు విద్యాబ్యాసం చేస్తారని, 12వ తరగతి తరువాత పోస్ట్ మెట్రిక్ ఉప కార వేతనం పథకం, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ పథకం ద్వారా ఉన్నత విద్యని అభ్యసించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. https:/jnan abhumi.ap.gov.in/ వెబ్ లింక్ ద్వారా పథకం మార్గదర్శ కాలు లభ్యం అవుతాయని, https:/shreshta.nta.nic.in/ వెబ్ లింక్ ద్వారా అర్హులైన విద్యార్థిని విద్యార్ధులు ఏప్రిల్ 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
0 Comments:
Post a Comment