Andhra Pradesh : ఫిట్మెంట్ 23 శాతమే.. హెచ్ఐర్డీ స్లాబులపై కొత్త ప్రతిపాదనలు ఉద్యోగ సంఘాల నేతలకు తేల్చి చెప్పిన మంత్రుల కమిటీ
అమరావతి: ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు కొనసాగుతున్నాయి. హెచ్ఐర్డీ స్లాబులపై కొత్త | ప్రతిపాదనలను మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతల ముందు ఉంచింది. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్తో 8 శాతం హెచ్ఎస్ఏ, 2 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్తో 9.5 శాతం, 10 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 15 వేల సీలింగ్తో 13.5 శాతం, 25 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.20 వేల సీలింగ్తో 16 శాతం, సచివాలయం, హెచ్డీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు రూ.23 వేల సీలింగ్తో 24 శాతం ఇస్తామని మంత్రుల కమిటీ పేర్కొంది. ఫిట్మెంట్ను 23 శాతమే ఇస్తామని తేల్చి చెప్పినట్లు సమాచారం.
ఐఆర్ను రికవరీ చేయబోమని, మట్టి ఖర్చుల నిమిత్తం రూ.25 వేలను ఇచ్చేందుకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. ఐదేళ్లకోసారి పీఆర్సీని అమలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రొబేషన్ అనంతరం కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఇస్తామని తెలిపింది. ఇంకా చర్చించాల్సిన అంశాలను అనామలీస్ కమిటీకి పంపుతామని ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల కమిటీ తెలిపింది. చర్చల్లో మంత్రుల కమిటీ సభ్యులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నానితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల | సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి. చంద్రశేఖర్రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెస్ఆర్) శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల తరపున పీఆర్సీ సాధన కమిటీ సభ్యులు బండి శ్రీనివాసరావు, కె.ఆర్.సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment