Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. వచ్చే మూడు రోజులు ఈ ప్రాంతాల్లో మళ్లీ వానలే..
వాయుగుండం ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటి తీవ్ర అల్ప పీడనంగా ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాలైన ఉత్తర తమిళనాడు రాయలసీమ మీద అల్పపీడనంగా బలహీనపడిందని పేర్కొంది.
దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటను 5.5 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాల మీదగా కొనసాగుతున్నదని వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి అల్పపీడన ద్రోణి ఉత్తర తమిళనాడు, రాయలసీమ కోస్తాంధ్ర మీదగా దక్షిణ ఒడిశా వరకు 1.5 కిలోమీటర్లు ఎత్తులో కొనసాగి బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఉత్తర కోస్తాంధ్ర-యానాం:
ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
0 Comments:
Post a Comment