RBI schemes: శుభవార్త... రెండు ఆర్బీఐ పథకాలను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తరఫున రెండు స్కీమ్స్ ప్రారంభించారు.
వీటిలో ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ఒకటి కాగా, రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ ఒకటి. గవర్నమెంట్ బాండ్ మార్కెట్ తలుపుల్ని రీటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరిచింది భారత ప్రభుత్వం. "ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా చిన్న ఇన్వెస్టర్లు కూడా ప్రభుత్వ సెక్యూరిటీస్లో సురక్షిత మాధ్యమం ద్వారా పెట్టుబడులు పెట్టడం సాధ్యం అవుతుంది" అని ప్రధాని మోదీ అన్నారు. కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ ప్రారంభించిన రెండు పథకాలు పెట్టుబడి మార్గాలను పెంచుతుందని, క్యాపిటల్ మార్కెట్కు సులభంగా, సురక్షితంగా యాక్సెస్ లభిస్తుందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్, రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్లను వర్చువల్ ఈవెంట్ ద్వారా లాంఛ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
RBI Retail direct Scheme: ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్
ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ రీటైల్ ఇన్వెస్టర్లను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన పథకం. రీటైల్ ఇన్వెస్టర్లు గవర్నమెంట్ సెక్యురిటీస్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే సెక్యూరిటీస్లో ఇన్వెస్టర్లు నేరుగా పెట్టుబడులు పెట్టొచ్చు. ఆర్బీఐ ప్లాట్ఫామ్లో ఉచితంగా గవర్నమెంట్ సెక్యురిటీస్ అకౌంట్ ఆన్లైన్లో ఓపెన్ చేయొచ్చు.
RBI Integrated Ombudsman Scheme: రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్
ఇక రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ ఆర్బీఐ నియంత్రించే సంస్థలపై కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. వన్ నేషన్ వన్ అంబుడ్స్మన్ లక్ష్యంగా ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటైంది. ఫిర్యాదులు చేయడానికి ఒకే పోర్టల్, ఒకే ఇమెయిల్, ఒకే అడ్రస్ ఉంటుంది. వీటి ద్వారా కస్టమర్లు కంప్లైంట్ చేయొచ్చు. బ్యాంకు కస్టమర్లు ఫిర్యాదులు చేయడం, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం, స్టేటస్ చెక్ చేయడం, ఫీడ్ బ్యాక్ ఇవ్వడం లాంటివన్నీ ఒకే ఇమెయిల్ అడ్రస్ ద్వారా సాధ్యం అవుతుంది.
0 Comments:
Post a Comment