ఏపీ బ్యూరో : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పీఆర్సీ నివేదిక | సోమవారం సాయంత్రం విడుదల కానుంది . ఉద్యోగుల నుంచి ఒత్తిడి నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు . సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్ పీఆర్సీ నివేదికను విడుదల చేసి 13 ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ప్రతులను అందజేయనున్నారు . అనంతరం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది . ఈనెల 17 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పీఆర్సీపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది . ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇస్తుండగా .. కనీసం 30 శాతం పైన పీఆర్సీ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు .
ప్రభుత్వ ఉద్యోగుల PRC పై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
◆ PRC నివేదిక విడుదలకు అంగీకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు
◆ సోమవారం సాయంత్రం PRC నివేదికను విడుదల చేయనున్న శశిభూషన్ కుమార్ (Pre. Secretary General Admission Dept.)
◆ PRC నివేదిక ప్రతులను 13 ఉద్యోగ సంఘాలకు అందజేయనున్నట్లు తెలిపిన ప్రభుత్వం
◆ నివేదికలోని అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్న ఏపీ ప్రభుత్వం
◆ ఈనెల 17వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో PRC పై ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు.
0 Comments:
Post a Comment