AISSEE -2022: సైనిక్ స్కూల్లో అడ్మిషన్కు దరఖాస్తు చేశారా.. పరీక్ష విధానం తెలుసుకోండి...
దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది.
ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ప్రవేశ పరీక్ష (Entrance Test) జనవరి 9, 2022న నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి.
ముఖ్య సమాచారం ..
పరీక్ష తేదీ జనవరి 9, 2022
పరీక్ష సమయం ఆరోతరగతి ప్రవేశాలకు 150 నిమిషాలు, తొమ్మిదో తరగతి ప్రవేశాలకు 180 నిమిషాలు
అర్హతలు..
- ప్రస్తుతం ఐదోతరగతి చదివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చదివే విద్యార్థులు తొమ్మిదో తరగతికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయసు 31.03.2021 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 12, తొమ్మిదో తరగతికి 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.
0 Comments:
Post a Comment