PRC Proposals with in 3 Days: మూడు రోజుల్లో పీఆర్సీ నివేదిక
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ నివేదిక ను పూర్తిగా మూడు రోజుల్లో బయట పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. వెలగపూడి సచివాలయం లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఆర్సీ నివేదిక బయట పెడితేనే సమావేశంలో ఉంటామని లేకుంటే బహిష్కరిస్తామని ప్రకటించారు. సమావేశం అయిన తర్వాత నివేదిక వెల్లడిస్తామని చెప్పిన సి ఎస్ మూడు రోజుల్లో పూర్తి పిఆర్సి నివేదిక బయటపెడతామని స్పష్టంగా ప్రకటించారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు సీఎస్ సమీర్ శర్మ. సీఎస్ తో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది.
గత కొంతకాలంగా పెండింగ్లో వున్న ఆర్థికేతర అంశాలను తక్షణం పరిష్కరిస్తామని గతంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో జరిగిన భేటీలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఉద్యోగుల అర్ధికేతర సమస్యల పరిష్కారంపై ఇప్పటికే దృష్టి సారించింది ప్రభుత్వం.
ఆర్దిక సమస్యలపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో చర్చ జరుగుతోంది. 11వ పీఆర్సీ అమలు, డీఏ బకాయిల విడుదల, సిపిఎస్ రద్దు, హెల్త్ కార్డులు వంటి అంశాలపై చర్చిస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపు వంటి డిమాండ్ల పై చర్చ సాగుతోంది.
ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షనర్లు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. తమకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఏ మేరకు ఉన్నాయో ప్రకటించాలని స్పష్టం చేస్తున్నారు ఉద్యోగులు. 11వ పీఆర్సీ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. ప్రభుత్వం వీటిని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
0 Comments:
Post a Comment