ఇక మూడేళ్ల బీఈడీ-ఎంఈడీ కోర్సు..
🍁ఈనాడు, దిల్లీ:
🔮ఒకేసారి బీఈడీ-ఎంఈడీ కలిపి చేసే మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈమేరకు గురువారం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనలు- 2014ను సవరించింది. 2021 సంవత్సరానికి సంబంధించిన కొత్త నిబంధనలు జారీచేసింది. ఇది మూడేళ్ల పూర్తి స్థాయి ప్రోగ్రామ్. మధ్యలో ఆపేయడానికి వీలుండదు. మూడేళ్లు పూర్తిచేయాల్సిందే. ఉపాధ్యాయులు, టీచర్ ఎడ్యుకేటర్స్, విద్యారంగంలో ఇతర నిపుణులను తయారుచేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కోర్సును ప్రవేశ పెట్టింది.
0 Comments:
Post a Comment