Big News: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. కారుణ్య నియామకాలపై కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కారుణ్య నియామకాలపై ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్..
అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని ఒకరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ తక్షణమే మొదలు కావాలని.. అంతేకాకుండా నవంబర్ 30వ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
విద్యుత్పై సీఎం సమీక్ష..
అటు రాష్ట్రంలోని విద్యుత్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూడాలని జగన్ అధికారులను ఆదేశించారు. కరెంటు ఉత్పత్తి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. సీలేరు సహా ప్రాజెక్టుల సాకారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని 50 మిలియన్ యూనిట్ల నుంచి 69 మిలియన్ యూనిట్లకు పెంచామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సింగరేణి సహా కోల్ ఇండియా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పులను వినియోగించుకునే ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచన చేయాలని అన్నారు. దీని వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయని అన్నారు.
170 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి..
కాగా, పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి 170 మెగావాట్ల విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తోందని అధికారులు సీఎంకు వివరించారు. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టిసారించాలని సీఎం ఆదేశించారు. 6300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలని సూచించారు.ఈ ప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
PRC GOVINDA HARI
ReplyDelete