ఓపెన్ స్కూల్ దరఖాస్తు కి 25 వరకు గడువు
గుంటూరు ఎడ్యుకేషన్:
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీ ఓఎస్ఎస్) ద్వారా 2021-22 విద్యాసంవత్సరానికి దూర విద్య 10వ తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవే శానికి తుది గడువు ఈనెల 25 అని డీఈఓ ఆర్.ఎస్ గంగా భవానీ బుధవారం తెలిపారు. టెన్త్ చేరేందుకు 14 ఏళ్ల వయస్సు, ఇంటర్లో ప్రవేశానికి టెన్త్ పూర్తి చేసి 15 ఏళ్ల వయసు నిండి ఉండాలని సూచించారు. అభ్య ర్ధులు అక్టోబర్ 25వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, అక్టోబర్ 27వ తేదీ లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్ ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే రూ.200 అపరాధ రుసుంతో దరఖాస్తు చేసేం దుకు నవంబర్ 6వ తేదీ వరకు అవకాశం ఉందని వెల్లడించారు. వివరాలకు డీఈవో కార్యాలయంతోపాటు హెచ్ఐటీటీపీఎస్.ఏపీఓ పెన్ స్కూల్.జీవోవీ. ఇన్ సైట్ను సందర్శిం చాలని సూచించారు.
0 Comments:
Post a Comment