Smartphone:కొత్తగా మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం లేదా తక్కువ ధరకి అమ్మడం లాంటివి చేస్తుంటాము. అయితే పాత ఫోన్ను అమ్మే సమయంలో ఫోన్లో డేటా పూర్తిగా తొలగించినా అందులో మనకి సంబంధించిన ఎంతో కొంత సమాచారం ఉండిపోతుంది. అందుకే పాత ఫోన్ని ఎవరికైనా అమ్మేటప్పుడు దాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం తప్పనిసరి అని మొబైల్ నిపుణులు సూచిస్తుంటారు. ఇలా చేయడం వల్ల మన ఫోన్లోని డేటా మొత్తం పూర్తిగా డిలీట్ అవ్వడమే కాకుండా ఫోన్ కొన్నప్పుడు ఉన్న సెట్టింగ్స్ ఉంటాయి. దీని వల్ల మీ డేటా పూర్తి సురక్షితంగా ఉంటుంది. ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయకపోతే మీ డేటా వివరాలు తెలిసిపోతాయి. దీని వల్ల సైబర్ నేరాలు, ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కొంత మందికి ఫోన్ను ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలి అనే విషయాలు తెలిసి ఉండవు. ఒక వేళ తెలిసినా.. రీసెట్ చేయాలనే ఆలోచన రాదు. ఎందుకంటే మనకు సంబంధించిన వివరాలు పెద్దగా ఏముంటాయనే భావనలో ఉంటారు. మరి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
ముందుగా మీ మొబైల్లోని వాట్సాప్, ట్విటర్, ఎంఎస్ ఆఫీస్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, గూగుల్ అకౌంట్, జీమెయిల్ వంటి అకౌంట్లను లాగౌట్ చేయండి. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్లో అకౌంట్స్లోకి వెళ్లి ఒక్కో ఖాతా నుంచి లాగౌట్ చేస్తే సరిపోతుంది. చివరిగా మీ గూగుల్ అకౌంట్ నుంచి లాగౌట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ పాత ఫోన్లోని వివరాలు సింక్ కాకుండా ఉంటాయి. ఆ తర్వాత మొబైల్లో మైక్రో ఎస్డీ కార్డు, సిమ్ కార్డులను తొలగించాలి. సెట్టింగ్లోకి వెళ్లి జనరల్ మేనేజ్మబెంట్పై క్లిక్ చేస్తే అందులో రీసెట్ సెక్షన్పై క్లిక్ చేయాలి. అందులో ఫ్యాక్టరీ డేటా రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోయి ఫోన్ రీస్టాట్ అవుతుంది.
ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఫోన్ ఆన్ చేస్తే ఆండ్రాయిడ్ వెల్కమ్ అని స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాంతో కొత్తగా మీ ఫోన్ ఉపయోగించేవారు తమ మీ వివరాలు తెలుసుకునేందుకు ఎలాంటి ఆస్కారం ఉండదు. అయితే ఇంకో విషయం ఏంటంటే.. ఫ్యాక్టరీ రీసెట్ ప్రాసెస్ ఫోన్ మోడల్ని బట్టి మారుతుంది. ఉదాహరణకు శాంసంగ్ ఫోన్లో ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఆప్షన్ సెట్టింగ్స్లో జనరల్ మేనేజ్మెంట్లో ఉంటుంది. షావోమి ఫోన్లలో సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లోకి వెళ్లి డిలీట్ ఆల్ (ఫ్యాక్టరీ రీసెట్) పేరుతో కనిపిస్తుంది. ఐఫోన్లో సెట్టింగ్స్లో జనరల్పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే రీసెట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి ఎరేజ్ ఆల్ కంటెంట్ అండ్ సెట్టింగ్స్ని సెలెక్ట్ చేయాలి. ఇలా ఒక్కో ఫోన్లలో ఒక్కో విధంగా ఉంటుంది.
జయంతి విషయానికొస్తే.. ఈమె అప్పటి అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, రాజ్ కుమార్, విష్ణు వర్ధన్, జెమినీ గణేషన్, ఎంజీఆర్., శివాజీ గణేషణ్తో బాలీవుడ్ నటులు షమ్మీ కపూర్తో పలువురు అగ్ర నటుల సరసన నటించింది. హిందీలో చివరగా ఈమె షారుఖ్, దీపికా హీరో, హీరోయిన్లుగా నటించిన 'ఓం శాంతి ఓం' సినిమాలో నటించింది. తెలుగులో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో కనిపించింది. ఈమె రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 1998లో లోక్సభ ఎన్నికల్లో లోకశక్తి పార్టీ తరుపున చిక్ బళ్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆమె మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 1999లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కోరటగిరే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత కొన్నేళ్లుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఈమె తుది శ్వాస విడిచారు. అప్పట్లో ఈమె చనిపోయినట్టు వార్తలు కూడా వచ్చాయి.
జయంతి విషయానికొస్తే.. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన చాలా సినిమాల్లో తండ్రి పాత్రలకు ఈమె జోడిగా నటించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన 'జస్టిస్ చౌదరి', 'కొండవీటి సింహం' వంటి సినిమాలున్నాయి. మరోవైపు ఏఎన్నార్ సరసన పలు చిత్రాల్లో కథానాయికగా నటించింది. కృష్ణ నటించిన 'కుమార రాజా' సహా పలు చిత్రాల్లో రెండో హీరోయిన్గా నటించి మెప్పించింది. అంతేకాదు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వంటి హీరోలకు తల్లి పాత్రల్లో అలరించింది. ముఖ్యంగా చిరంజీవి 'కొదమ సింహం', బాలయ్య 'వంశానికొక్కడు', వెంకటేష్ 'అజేయుడు' వంటి చిత్రాలున్నాయి. ఇక మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు సినిమాలో రజినీకాంత్ చెల్లెలుగా.. మోహన్ బాబు మేనత్త పాత్రలో అలరించింది. అప్పట్లో షూటింగ్కు లేట్ వచ్చిందనే కారణంతో మోహన్ బాబు ఈమెపై చేయి చేసుకున్నారనే వార్త పెద్ద సంచలనం రేపింది. ఇక కన్నడనాట ఈమె నెంబర్ వన్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. అక్కడ రాజ్కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్ వంటి అగ్ర నటుల సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించారు. ఈమె మృతి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments:
Post a Comment