పాత పింఛను విధానం తెచ్చే ప్రసక్తే లేదు లోక్ సభలో లిఖిత పూర్వకంగా తేల్చిచెప్పిన కేంద్రం
న్యూఢిల్లీ , జూలై 15 : ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ పింఛను విధా నాన్నే ( ఎన్పీఎస్ ) కొనసాగిస్తామని . 2001 కు ముందున్న పాత పెన్షన్ విధానాన్ని ( ఓపీఎస్ ) మళ్లీ తెచ్చే అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది . ఈ మేరకు లోక్ సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది . పాత విధానంలో .. పదవీ విరమణ చేసేనాటికి ఉన్న జీతం , సర్వీసు కాలం ఆధారంగా పింఛను అందేది . కానీ , 2004 లో ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానం ప్రకారం ఉద్యోగి జీతం నుంచి 10 శాతం మొత్తానికి ప్రభుత్వం కూడా అంతే మొత్తం కలిపి మార్కెట్లో పెట్టుబడి పెడుతుంది . వచ్చే లాభాల ఆధారంగా పింఛను ఇస్తారు . దీన్ని తొలుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగు లకు తప్పనిసరి చేయగా , క్రమంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి . కానీ , ఈ కొత్త విధా నంపై పలు ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి . పాత వెన్షన్ విధానాన్ని అమలు చేస్తామనే పార్టీలకే ఓటు వేస్తా మని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయి . అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం . పాత పింఛను విధానాన్ని పునఃప్రవేశపెట్టే అవకాశమే లేదని సోమవారం పార్లమెంటు సాక్షిగా తేల్చి చెప్పడం గమనార్హం .
0 Comments:
Post a Comment