📚✍7జిల్లాల్లో తీవ్ర వడగాలులు
🌻ఈనాడు, అమరావతి: ఏప్రిల్ ప్రారంభంలోనే వేసవి ఠారెత్తిస్తోంది. విజయవాడతో సహా రాష్ట్రంలోని 7 జిల్లాల్లో శుక్రవారం తీవ్ర వడగాలులు నమోదయ్యాయి. మరో 180 మండలాల్లో వడగాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లాలోని 4 మండలాలు, పశ్చిమగోదావరి 15, కృష్ణా 9, గుంటూరు 11, ప్రకాశం 8, నెల్లూరు 3, చిత్తూరు 2 మండలాల్లో.. మొత్తంగా 52 మండలాల్లో వడగాలులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రతలకన్నా దాదాపు 7డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం మినహా 12 జిల్లాల్లోని 180 మండలాల్లో వడగాలులు వీచాయని వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది. ఇక్కడ సాధారణంకన్నా 5, 6 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 2రోజుల్లో వడగాలుల ఉద్ధృతి తగ్గనుందన్న సూచనలున్నాయి. శనివారం రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 19 మండలాల్లో మాత్రమే వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
0 comments:
Post a comment