తాడేపల్లి:
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన!!!
మత్తులో జోగుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు - గుర్తించ లేకపోయిన ఉపాద్యాయులు...
తాడేపల్లిలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు మత్తు పదార్థాలు సేవిస్తుండగా స్థానికులు గుర్తించి పాటశాల ఉపాధ్యాయులకు ఫిర్యాదు...
ఇద్దరు విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయుని ఎదుట హాజరు పెట్టిన స్థానికులు...
వైట్ నర్, సొల్యూషన్, చేతి రుమాలులో చుట్టి పీలుస్తూ మత్తులో తూగుతున్న విద్యార్థులు...
మత్తులో తూగుతున్న విద్యార్థులను అప్పగిస్తే తేలిగ్గా తీసుకున్న ఉపాధ్యాయులు...
ఉపాధ్యాయుల తీరుపై మండిపడ్డ స్థానికులు ఆపై పోలీసులకు ఫిర్యాదు..
రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలింపు...
తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు..
మత్తు పదార్థాలు సేవించిన విద్యార్థులు చెప్పిన వివరాలతో ఆశ్చర్య పోయిన పోలీసులు...
తామే కాదు తమతో పాటు చాలామంది విద్యార్థులు ఇదే విధంగా మత్తు ఇచ్చే పదార్థాలు సేవిస్తున్నటట్లు వెల్లడి...
ఎక్కువ మంది విద్యార్థులు మత్తులో జోగుతున్న తమ దృష్టికి రాలేదని ప్రధాన ఉపాద్యాయులు చెప్పటం గమనార్హం....
విద్యార్థులకు మత్తు ఇచ్చే పదార్థాలు ఎవరు విక్రయిస్తున్నారో విచారించాల్సిన పోలీసులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు కౌన్సెలింగ్ తోనే సరిపెటారు...
ఇంకా ఎంత మంది విద్యార్థులు మత్తుకు అలవాటు పడ్డారో గుర్తించక పోతే వారి బంగారు భవిష్యత్తు బుగ్గి పాలు అవుతుంది...
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు, సామాజిక బాధ్యత కలిగిన వారందరు ముందుకు వచ్చి విద్యార్థుల భవిష్యత్తు ను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది...
తాడేపల్లి ప్రాంతంలో ఇప్పటికే అనేక మంది యువకులు గంజాయికి బానిసలుగా మరి తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారు...
ఇటీవల పోలీసులు దాదాపుగా 50 మంది యువకులను విచారణ జరిపారు...
గంజాయి విక్రయిస్తూ.. సేవిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు...
ఇలాంటి ఘటనలు మరువక ముందే పాఠశాల విద్యార్థులు మత్తులో జోగుతున్నారనే నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్న తల్లిదండ్రులు...
0 Comments:
Post a Comment