Surgical Strike on Pakistan: పాకిస్తాన్పై మరో దేశం సర్జికల్ స్ట్రైక్.. లోపలికి దూసుకెళ్లి మరీ దాడి..
పాకిస్తాన్ మీద మరో దేశం సర్జికల్ స్ట్రైక్ చేసింది. అది ఇరాన్. ఇరాన్ కూడా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ ఉన్న తమ ఇద్దరు సైనికులను విడిపించుకుంది. మూడేళ్ల క్రితం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి దాచిపెట్టిన ఇద్దరు ఇరాన్ సైనికులను సర్జికల్ స్ట్రైక్ చేసి విడిపించుకుంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి సమయంలో ఈ సర్జికల్ స్ట్రైక్ జరిగింది. దీనికి సంబంధించి పాకిస్తాన్కు ఎలాంటి చిన్న క్లూ కూడా ఇవ్వకుండా వారి భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దెబ్బకొట్టింది. మిలటరీ విభాగానికి ఏ మాత్రం అందకుండా వారి దేశం లోపలికి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసి తమ వారిని విడిపించుకుంది. ఈ సర్జికల్ స్ట్రైక్లో, ఉగ్రవాదుల డెన్కు కాపాలాగా ఉన్న కొందరు ఆర్మీ అధికారులు చనిపోయినట్టు తెలిసింది.
ఇరాన్కు చెందిన ఎలైట్ రివ్యూషనరీ గార్డ్స్ ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. పాకిస్తాన్లో ఉన్న తమ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన సమాచారం మేరకు కిడ్నాప్నకు గురైన సైనికులను ఉగ్రవాదులు ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకుని వారి ప్రాంతంలోనే దాడి చేసింది.
పాకిస్తాన్పై జరిపిన సర్జికల్ స్ట్రైక్ విజయవంతం అయిందని ఇరాన్ ప్రకటించింది. 'ఫిబ్రవరి 3న మంగళవారం సర్జికల్ స్ట్రైక్ చేశాం. గతంలో కిడ్నాప్నకు గురైన బోర్డర్ గార్డులను ఇద్దరినీ రక్షించాం.' అని ఓ ప్రకటనలో పేర్కొంది. వారిని జైష్ ఉల్ అదుల్ అనే సంస్థ రెండున్నరేళ్ల క్రితం కిడ్నాప్ చేసింది. సర్జికల్ స్ట్రైక్ చేసిన ఇరాన్ సైనికులు క్షేమంగా తమ దేశానికి కూడా వచ్చేశారని ఆ ప్రకటనలో తెలిపింది.2018 అక్టోబర్ 16న ఇరాన్ - బలూచిస్తాన్ సరిహద్దుల వద్ద గొడవల్లో 12 మంది సైనికులను పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్ అదుల్ కిడ్నాప్ చేసింది. వారిని తమ ఆధీనంలో పెట్టుకుంది. అయితే, ఈ ఘటన అనంతరం మిలటరీ అధికారులు ఓ జాయింట్ కమిటీగా ఏర్పడి రెండు దేశాల మధ్య సయోధ్యను కుదిర్చారు. కిడ్నాప్ చేసిన వారిలో ఐదుగురిని 2018 మే 15న రిలీజ్ చేశారు. మరో నలుగురిని 2019 మే 21 మిలటరీ అధికారులు రక్షించారు. ఇప్పుడు ఇద్దరు సైనికులను రక్షించినట్టు ఇరాన్ ప్రకటించింది.
జైష్ ఉల్ అదుల్ అనేది మిలటరీ ఆర్గనైజేషన్. దీన్ని ఇరాన్ ఉగ్రవాద సంస్థగా గతంలో ప్రకటించింది. ఇరాన్ మీద ఈ సంస్థ పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. ఆగ్నేయ ఇరాన్లో సున్నీ ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ సంస్థ తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇరాన్ సైనికులతో పాటు , ప్రజల మీద కూడా పలుమార్లు ఉగ్రదాడులు చేసింది. దీనికి పాకిస్తాన్ ఆర్మీ సహకారం ఉందని ఇరాన్ నిఘావర్గాలు చెప్పాయి.
0 comments:
Post a comment