7న ఐఐఐటి రెండో విడత కౌన్సెలింగ్
🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాల్డెజ్
టెక్నాలజీ( ఆయుకెటి)లోని ఐఐఐటి ప్రవేశాలకు సంబంధించిన రెండో విడత కౌన్సెలింగ్ ఫిబ్రవరి 7న జరగనుంది. ప్రత్యేక విభాగ విద్యార్థులు, వికలాంగ, ఎన్సిసి, స్పోర్ట్స్ ఈ కౌన్సెలింగ్ లో సీట్లు కేటాయింపు ఉంటుందని చాన్సలర్ కెసి రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విభాగాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు వీటిపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 29లోపు admissions@rgukt.ino ఫిర్యాదు చేయాలని వివరించారు. కృష్ణా జిల్లాలోని నూజివీడు క్యాంపస్ లో ఈ కౌన్సెలింగ్ జరుగుతుందని వెల్లడించారు మొదటి దశలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈ నెల 31లోపు క్యాంపస్లో రిపోర్టు చేయాలని సూచించారు.
0 comments:
Post a comment