కళ్ళు చెదిరే ఇల్లు కట్టిన చిత్తుకాగితాలు ఏరుకునే మహిళ.. కేంద్ర అవార్డు దాసోహం..
చిత్తు కాగితాలు ఏరుకునే మహిళ, కళ్లుచెదిరే భవనం కట్టేసింది.. దింతో ప్రధాని మోదీ నుంచి ఊహించని గిఫ్ట్ అందుకోబోతుంది. కృష్ణా జిల్లా నందిగామలో ఇళ్లలో పని చేసుకుంటూ, చిత్తు కాగితాలు ఏరుకునే ముంగి శాంతి అనే ఓ మహిళ కళ్లుచెదిరే అద్భుత ఇంటిని నిర్మించారు.
ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ బిల్డింగును చూసేందుకు సమీప ప్రజలు క్యూకడుతున్నారు ఎంతో ఆకర్షణీయంగా ఈ ఇళ్ళు ఉంది ఇంటి బయట లోపల ఎక్కడ చూసినా అద్భుతంగా ఉంటుంది. మార్బుల్ ఫ్లోరింగ్, ఆకట్టుకునే పెయింటింగ్, ఆల్టెక్ గోడలు.. పక్కా సీలింగ్తో అట్టహాసంగా కనిపిస్తుంది.
బయటి నుంచి చూసే వారు బాగా డబ్బున్న సౌండ్ పార్టీ ఇల్లు అని అనుకుంటారు.
కానీ, ఈ ఇంటి ఓనర్లు ఎవరో తెలుసుకొని షాకవుతున్నారు. ఈ ఇల్లు కట్టుకున్నది ఓ రిక్షా కార్మికుడు, నాలుగిళ్లలో పాచి పనులు చేస్తూ.. చిత్తు కాగితాలు ఏరుకుని అమ్ముకునే అతడి భార్య ముంగి శాంతి అని తెలుసుకొని అవాక్కు అవుతున్నారు కృష్ణా జిల్లా నందిగామలో ఈ ఆదర్శ దంపతులు నిర్మించుకున్న బొమ్మరిల్లు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీసారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్నే ఆకర్షించింది
ఎప్పటికైనా సొంతిల్లు కట్టుకోవాలనేది శాంతి కల. ఇల్లంటే.. తలదాచుకునేందుకు కాదని గట్టిగా అనుకుంది. నాలుగిళ్లలో పనిచేసే శాంతి.. ప్రతి ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి, తానూ అలాంటి ఇల్లే కట్టుకోవాలని కలలు కనేది. ఆ కలను నెరవేర్చుకోడానికి పక్కాగా ప్రణాళిక వేసుకుంది. పెళ్లయిన కొత్తలో ఆ దంపతులు నందిగామచెరువు బజారులో 2 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో రూ. 40 వేలు డ్వాక్రా రుణం తీసుకుని ఆ స్థలంలో ఇంటి పని మొదలు పెట్టారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 'హౌసింగ్ ఫర్ ఆల్' పథకానికి శాంతి దరఖాస్తు చేసుకోగా ఈ పథకంలో వారికి రూ. 2.50 లక్షల ఆర్థిక సహకారం అందింది.అలాగే మరి కొంతవడబ్బు చిట్టీలు వేసి కొంత సమకూర్చుకుంది.
తర్వాత ఇంటి పట్టా తనఖా పెట్టి కొంత, తెలిసిన వారి దగ్గర సుమారు రూ. 10 లక్షల వరకు అప్పులు చేసింది. శాంతి పెద్దగా చదువుకోలేదు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అవగాహన కూడా అంతగా లేదు. కానీ, తాను పనిచేసే ఇళ్లను చూసి.. ఇల్లు ఎలా ఉండాలో నిర్ణయించుకుంది. అందుకు అనుగుణంగా తాపీ మేస్త్రీలకు సూచనలు ఇచ్చేది. ఇంటి నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. దింతో కేంద్ర ప్రభుత్వ ఇచ్చే ఉత్తమ ఇళ్ళు ఎంపికైంది.
శాంతి బలమైన సంకల్పంతో నిర్మించుకున్న ఇల్లు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 'ఇన్నోవేషన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ' అవార్డుకు ఎంపిక కావటం అందరిని ఆశదయర్యనికి గురి చేస్తుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకంలో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ శాఖ ఉత్తమ ఇంటి నిర్మాణం విభాగంలో భాగంగా శాంతిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆమె అవార్డు స్వీకరించనున్నారు.
ఈ సందర్భంగా ముంగి శాంతి మాట్లాడుతూ తాము చాలా పేదోళ్లమని, ఎప్పుడో కొనుక్కున్న రెండు సెంట్ల స్థలంలో శక్తికి మించి అప్పులు చేసి మంచి ఇల్లు కట్టుకున్నట్లు తెలిపారు. మా ఇంటికి కేంద్ర ప్రభుత్వ అవార్డు వచ్చిందంటే కలగానూ, భయంగానూ ఉందని పేర్కొన్నారు. ఎవరెవరో ఫోన్లు చేసి అడుగుతున్నారని, మాకు ఇవేమీ తెలీవని.. అప్పుల నుంచి బయటపడేందుకు ఎవరైనా తోడ్పాటునందిస్తే వారికి రుణపడి ఉంటామని శాంతి కోరుతుంది.
0 comments:
Post a comment