సీఎస్ కు మరో లేఖ రాసిన నిమ్మగడ్డ..ఫిబ్రవరిలోనే ఎన్నికలు ?
ఆంధ్రప్రదేశ్లో ఎలా అయినా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి తీరాలి అని నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎలా అయినా వాటిని వాయిదా వేయించాలి అని ప్రభుత్వం చేయని ప్రయత్నాలు లేవు. తాజాగా ఏపీ సి ఎస్ కు మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ఫిబ్రవరిలో నిర్వహించే ఎన్నికల కోసం సహకరించాలని ఆయన లేఖలో కోరారు. ఈ లేఖలో హైకోర్టు ఆదేశాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తావించినట్లు చెబుతున్నారు.
2021 ఓటర్ల సవరణ ప్రక్రియను జనవరి నాటికి పూర్తి చేయాలని కూడా ఆయన సూచనలు చేశారు. నిజానికి ఎన్నికల ప్రక్రియ కోసం సహకరించాలని నవంబర్ 23న సీఎస్ నిమ్మగడ్డ మొదటగా లేఖ రాశారు. అయితే అప్పుడు కుదరదని ఆమె వెంటనే మరో లేఖ కూడా రాశారు.
ఈ లేఖ కాస్త వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఆయన లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సిఎస్ తో పాటు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్లకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖలు రాశారు.
Better call him as TDP agent ..
ReplyDelete