ఆదివారం కూడా వారాల్లో ఒకటి. కానీ ఆదివారం అంటే హాలిడే అని ఎంతోకాలం నుండి మనం ఫిక్స్ అయిపోయాం. అందుకే ఆదివారం వస్తే పని చేయడానికి చాలా మందికి కొంచెం బద్దకంగా అనిపిస్తుంది. వారం మొత్తం పని చేసిన తర్వాత వచ్చే ఆదివారం మాత్రం రెస్ట్ తీసుకునే డే గానే కన్సిడర్ చేస్తారు. అయితే భారతదేశంలో ఆదివారం సెలవు రోజుగా ఎవరు ప్రకటించారో, అసలు భారతదేశంలో ఆదివారం సెలవు ఎలా వచ్చిందో తెలుసా?
స్వతంత్రం రాకముందు, అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న సమయంలో భారతదేశంలో ఉన్న మిల్స్ లో పని చేసేవాళ్ళు వారంలో ఏడు రోజులు పని చేయాల్సి వచ్చేది. వాళ్లు సెలవు లేదా విశ్రాంతి తీసుకునేవారు కాదు. అప్పుడు నారాయణ్ మేఘాజీ లోఖండే మిల్స్ వర్కర్లకు లీడర్ గా ఉండేవారు.
ఆయన వారంలో ఒకరోజు సెలవు రోజు ఉండాలి అనే ఆలోచనను బ్రిటిషర్స్ దగ్గర ప్రతిపాదించారు.వారంలో ఆరు రోజులు కష్టపడి పని చేసిన తర్వాత వర్కర్స్ కి తమ దేశానికి, సమాజానికి సేవ చేయడానికి ఒక్కరోజు కావాలి అని నారాయణ్ మేఘాజీ లోఖండే అన్నారట.
కానీ బ్రిటిష్ అధికారులు ఈ ప్రతిపాదనని తిరస్కరించారట. నారాయణ్ మేఘాజీ లోఖండే ఈ విషయంపై పోరాటం చేశారు. ఏడు సంవత్సరాల ఉద్యమం తర్వాత 1890లో జూన్ 10 వ తేదీన బ్రిటీష్ గవర్నమెంట్ ఆదివారాన్ని హాలిడే గా డిక్లేర్ చేసిందట.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, భారతదేశంలో ఆదివారం సెలవు దినంగా బ్రిటీష్ గవర్నమెంట్ ప్రకటించింది. భారతదేశ గవర్నమెంట్ ఈ విషయంపై ఎటువంటి ఆర్డర్ జారీ చేయలేదు. కానీ ఏదేమైనా “ఫాదర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మూమెంట్ ఇన్ ఇండియా” అయిన నారాయణ్ మేఘాజీ లోఖండే యొక్క ఏడేళ్ల పోరాటానికి ఫలితంగా ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు.
నారాయణ మేఘాజి, జ్యోతిరావు పూలే గారితో కలిసి ఉద్యమాలు చేసేవారు, కార్మిక నాయకుడిగా ఉంది కార్మికులకి వారంలో ఒక రోజు సెలవు దినంగా ఉండాలని బ్రిటిష్ వారితో పోరాటం చేసారు, వారం రోజులు బ్రిటిష్ వారి దగ్గర వెట్టి చాకిరి చేయడానికే సరిపోతుంది, కుటుంబం గురుంచి, సమాజం గురుంచి ఆలోచించడానికి సమయం దొరకట్లేదని అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని వారంలో ఒక రోజు సెలవు కావాలనే ప్రస్తావన 1881 లో బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఉంచితే ప్రభుత్వం ఒప్పుకోని కారణంగా ఉద్యమం మొదలు పెడితే అది తీవ్ర రూపం దాల్చి ఆఖరికి బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చి 1889 లో ఆదివారం సెలవు ప్రకటించింది, ఆదివారం సెలవుతో పాటు కార్మికులకి మధ్యాహ్నం పూట ఒక అరగంట విశాంత్రి సమయం ఇవ్వాలని, జీతాలు నెల 15 తేదీనే ఇవ్వాలని పోరాటం చేసి విజయం సాధించారు, భారత దేశంలో కార్మిక ఉద్యమాలకి పితామహుడిగా “నారాయణ మేఘాజి లోఖండే” గారిని చెప్పుకుంటారు.నారాయణ మేఘాజి లోఖండే గారి పేరు మీద 2005 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ ని విడుదల చేసింది. మనం ప్రతివారం హయిగా ఎంజాయ్ చేస్తున్న ఆదివారం వెనుక ఉన్న చరిత్ర..!
0 comments:
Post a comment