రండి చూడండి .. పిల్లల ని బడికి పంపించండి.. అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు
పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతున్నప్పటికీ విద్యార్థులను తరగతులకు రప్పించేందుకు అందుబాటులో వున్న అన్ని ప్రయత్నాలను విద్యాశాఖ చేస్తోంది. ఈ నెల 2వ తేదీ నుంచి 9, 10, సీనియర్ ఇంటర్ తరగతులను ప్రారంభిం చిన విద్యా శాఖ మరోవారం వ్యవధిలో 6, 7, 8 తరగతు లను ఈ నెల 23 నుంచి నిర్వహించడానికి సమాయత్తం అవుతోంది. తొలి దశలో ప్రారంభించిన 9, 10 తరగతు లకు బాలబాలికల హాజరు స్వల్పంగా ఉంది. పట్టణ ప్రాంత పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 10 నుంచి 14 శాతంలోపల మాత్రమే ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 20 నుంచి 30 శాతంగా ఉంది, కరోనా పట్ల విద్యార్థులు తల్లి దండ్రుల్లో ఆందోళన కొనసాగుతుండడమే దీనికి కారణమని తేలింది. 9, 10 తరగతులకు హాజరుకాని విద్యా ర్థుల గురించి సర్వే నిర్వహించాలని విద్యాశాఖ అధికా రులు ఆదేశించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశా లల్లో పనిచేస్తున్న టీచర్లతోపాటు పీఆర్పేల సేవలను ఈ సర్వేకు వినియోగించుకోవాలని సూచించారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థుల వివరాలను ఈ నెల 17లోగా సర్వే ద్వారా సేకరించాలని నిర్దేశించారు. తరగతులకు గైర్హాజరవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు రాయాలని కాకినాడ ఆర్జేడీ ఆర్.నరసింహారావు జిల్లా విద్యాశాఖకు నిర్దేశం చేశారు. తరగతులకు హాజరు కాకపోవడం వల్ల చదువులో వెనుకబడిపోతారని, అలాగే కొవిడ్-19 నిరోధానికి తీసుకున్న చర్యలన్నింటిని తెలిసే లా లేఖలో పొందుపర్చారు. ఆ మేరకు తల్లిదండ్రులు పాఠశాలను సందర్శించాలని పిల్లలను నిరభ్యంతరంగా తరగతులకు పంపించాలని లేఖలో అభ్యర్థించారు. దీని పై స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
0 comments:
Post a comment